AC Truck Cabins: ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. లారీలో తప్పనిసరిగా అది ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Truck Cabins: ఎండాకాలం, చలికాలం, వానల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు పెద్ద ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్య తీసుకుంది. దీని కారణంగా వారు ఆనందంగా డ్రైవ్ చేయగలుగుతారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ 2025 నుండి అన్ని ట్రక్కు క్యాబిన్లను తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ (AC) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల డ్రైవర్లు సులువుగా డ్రైవింగ్ చేయడంతోపాటు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
కంపెనీలు ట్రక్కుల ధరలను పెంచాయని కొంతకాలంగా ప్రజలకు ఫిర్యాదులు వస్తున్నాయని, అయినప్పటికీ క్యాబిన్లో ఏసీ సౌకర్యం కల్పించడం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. ట్రక్ డ్రైవర్ క్యాబిన్లో ఏసీ ట్రక్ క్యాబిన్లను తప్పనిసరి చేసే ఫైల్పై తాను ఈ రోజు సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవి, చలి, వాన సమయాల్లో ట్రక్కు డ్రైవర్లు పగలు, రాత్రుళ్లు డ్రైవింగ్ చేస్తారు.. అయితే వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ట్రక్కు పరిశ్రమను అప్గ్రేడ్ చేయడానికి 18 నెలల గడువు ఇచ్చారు.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
Read Also:Covid Vaccine: రెండు వారాల్లో తేలనున్న కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటుకు మధ్య సంబంధం
Launching ‘Desh Chaalak – Recognizing those who move India’ by Mahindra Logistics, New Delhi https://t.co/9MHUyWmvGr
— Nitin Gadkari (@nitin_gadkari) June 19, 2023
ట్రక్కు ధర ఎంత?
వోల్వో , స్కానియా వంటి బహుళజాతి కంపెనీలు ఇప్పటికే ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లతో ట్రక్కులను తయారు చేస్తున్నాయి. గతంలో కొన్ని కంపెనీలు ఏసీని అమర్చేందుకు ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు 2025 నాటికి అన్ని ట్రక్కులకు ఏసీ ఉండాలని కేంద్ర మంత్రి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఈ ఉత్తర్వు తర్వాత ట్రక్కులను తయారు చేసే కంపెనీలు ఏసీ క్యాబిన్లను ఏర్పాటు చేస్తే ఒక్కో ట్రక్కుకు అదనంగా రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు అవుతుంది.
రోడ్డు పక్కన సౌకర్యాలు
జాతీయ రహదారులపై రోడ్ల పక్కన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 570 రోడ్ సైడ్ ఫెసిలిటేషన్ కేంద్రాలపై పని చేస్తోంది. వీటిలో 170 టెండర్లు దాఖలయ్యాయి, పనులు కూడా ప్రారంభమయ్యాయి. హైవేకి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫెసిలిటీ సెంటర్ చేయడమే తమ లక్ష్యమని గడ్కరీ చెప్పారు.
Read Also:Nidhi Agarwal : టెంప్టింగ్ లుక్ తో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..
- Tags
- AC Truck
- bjp
- Driver
- nitin gadkari
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!