AC Truck Cabins: ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. లారీలో తప్పనిసరిగా అది ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Truck Cabins: ఎండాకాలం, చలికాలం, వానల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు పెద్ద ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్య తీసుకుంది. దీని కారణంగా వారు ఆనందంగా డ్రైవ్ చేయగలుగుతారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ 2025 నుండి అన్ని ట్రక్కు క్యాబిన్లను తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ (AC) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల డ్రైవర్లు సులువుగా డ్రైవింగ్ చేయడంతోపాటు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
కంపెనీలు ట్రక్కుల ధరలను పెంచాయని కొంతకాలంగా ప్రజలకు ఫిర్యాదులు వస్తున్నాయని, అయినప్పటికీ క్యాబిన్లో ఏసీ సౌకర్యం కల్పించడం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. ట్రక్ డ్రైవర్ క్యాబిన్లో ఏసీ ట్రక్ క్యాబిన్లను తప్పనిసరి చేసే ఫైల్పై తాను ఈ రోజు సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవి, చలి, వాన సమయాల్లో ట్రక్కు డ్రైవర్లు పగలు, రాత్రుళ్లు డ్రైవింగ్ చేస్తారు.. అయితే వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ట్రక్కు పరిశ్రమను అప్గ్రేడ్ చేయడానికి 18 నెలల గడువు ఇచ్చారు.
Also Read
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
Read Also:Covid Vaccine: రెండు వారాల్లో తేలనున్న కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటుకు మధ్య సంబంధం
Launching ‘Desh Chaalak – Recognizing those who move India’ by Mahindra Logistics, New Delhi https://t.co/9MHUyWmvGr
— Nitin Gadkari (@nitin_gadkari) June 19, 2023
ట్రక్కు ధర ఎంత?
వోల్వో , స్కానియా వంటి బహుళజాతి కంపెనీలు ఇప్పటికే ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లతో ట్రక్కులను తయారు చేస్తున్నాయి. గతంలో కొన్ని కంపెనీలు ఏసీని అమర్చేందుకు ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు 2025 నాటికి అన్ని ట్రక్కులకు ఏసీ ఉండాలని కేంద్ర మంత్రి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఈ ఉత్తర్వు తర్వాత ట్రక్కులను తయారు చేసే కంపెనీలు ఏసీ క్యాబిన్లను ఏర్పాటు చేస్తే ఒక్కో ట్రక్కుకు అదనంగా రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు అవుతుంది.
రోడ్డు పక్కన సౌకర్యాలు
జాతీయ రహదారులపై రోడ్ల పక్కన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 570 రోడ్ సైడ్ ఫెసిలిటేషన్ కేంద్రాలపై పని చేస్తోంది. వీటిలో 170 టెండర్లు దాఖలయ్యాయి, పనులు కూడా ప్రారంభమయ్యాయి. హైవేకి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫెసిలిటీ సెంటర్ చేయడమే తమ లక్ష్యమని గడ్కరీ చెప్పారు.
Read Also:Nidhi Agarwal : టెంప్టింగ్ లుక్ తో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..
- Tags
- AC Truck
- bjp
- Driver
- nitin gadkari
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!