NIKHAT ZAREEN : ప్రపంచబాక్సింగ్ క్వార్టర్స్ లోకి తెలంగాణ అమ్మాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో అదరగొడుతుంది. టైటిల్ ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ అమ్మాయి మరో అడుగు ముందుకేసింది. నిన్న జరిగిన 50కేజీల ప్రీక్వార్టర్స్ లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్(మెక్సికో)ను చిత్త చేసింది. ఆరంభం నుంచి పంచ్ పవర్ చూపించిన నిఖత్.. ప్రత్యేర్థికి అవకాశమే ఇవ్వలేదు. మంచి పుట్ వర్క్ కు తోడు లెఫ్ట్, రైట్ హుక్ ల మేళవింపుతో దాడికి దిగిన నిఖత్ జరీన్ ముందు ప్యాట్రిసియా తేలిపోయింది. ప్రతి రౌండ్ లోనూ జడ్జ్ లు నిఖత్ కే ఓటేయడంతో ఆమె ఘన విజయం సాధించింది.
Also Read : Kidnap Drama: మార్కులు తక్కువస్తే పేరెంట్స్ తిడతారని భలే స్కెచ్ వేసింది.. కానీ సీన్ రివర్స్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
మరోవైపు భారత్ కు చెందిన నీతు గాంగాస్ (48కేజీ), మనీషా (57కేజీ), జాస్మిన్ (60కేజీ) క్వార్టర్ ఫైనల్ చేరారు. ప్రీక్వార్టర్స్ లో సుమైయా ఖోసిమోవా ( తజకిస్తాన్ )ను నీతు నాకౌట్ చేసింది. తొలి రౌండ్ లోనే నీతు పంచ్ లకు సుమైనా నిలవలేకపోవడంతో రిఫరీ బౌట్ ను ఆపేశారు. మరో ప్రిక్వార్టర్సలో నూర్ తుర్హాన్( తుర్కియే)పై మనీషా గెలిచింది. ప్రత్యర్థి బాక్సర్ కంటే పొడగరి అయిన మనీషా పదునైన పంచ్ లతో అటాక్ చేసి విజయాన్ని అందుకుంది. మనీషా దూకుడుకు నూర్ ఆటను కొనసాగించలేకపోవడంతో రిఫరీ మ్యాచ్ ను ఆపి భారత్ బ్యాక్సర్ ను విజేతగా ప్రకటించారు. ఇంకో ప్రీ క్యార్టర్స్ లో సమదోవా( తజకిస్తాన్ )ను జాస్మిన్ ఓడించింది. మరోవైపు శశిచోప్రా(63కేజీ), మంజు(66) టోర్నీ నుంచి నిష్ర్కమించారు. కిటో(జపాన్)చేతిలో శశి.. ఖామిదోవా(ఉబ్బెకిస్తాన్)చేతిలో మంజు చిత్తుగా ఓడిపోయారు.
Also Read : Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. వణికిన ఉత్తర భారతం..
కాగా, ఆదివారం ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆఫ్రికన్ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్ రౌమైసాతో నిఖత్ తలపడింది. 5-0 ఏకపక్ష స్కోర్ తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్టర్స్ లో గెలిచింది. మ్యాచ్ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే ఆట మొదటి రౌండ్ లో నిఖత్ కు తన ఆటతీరుతో రెచ్చిపోయింది. దీంతో ఆ రౌండ్ ఆమెకు అనుకూలంగా మారింది. ఎన్నో బాడీ షాట్ల వ్యూహాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. చివరకు 5-0తో వార్ వన్ సైడ్ చేసి విజేతగా నిఖత్ జరీన్ నిలిచింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..