మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అంతగా కలిసి రాలేదు దీంతో ప్రజంట్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవల ‘శ్రీ చిదంబరంగారు’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయింది నిహారిక, తన వ్యక్తిగత.. వృత్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘సినిమా నిర్మాణం అనేది ఒక బాధ్యత. ఒక సినిమాను మన బుజాల మీద వేసుకున్నప్పుడు వచ్చే స్ట్రెస్ ఏంటో ‘కమిటీ కుర్రాళ్లు’ సమయంలో నాకు అర్థమైంది’ అంటూ నిర్మాతగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తేనే ఇండస్ట్రీ ఊపిరి తీసుకుంటుందని ఆమె బలంగా నమ్ముతున్నారు.
Also Read : Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!
అయితే సాధారణంగా సెలబ్రిటీలు తమ లోపాలను బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ నిహారిక చాలా ఓపెన్గా తన ఇన్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు.. ‘‘నేను మనిషినే కాదా? నాకు కూడా ఇన్ సెక్యూరిటీస్ ఉంటాయి. చిన్నప్పుడు నా ‘గమ్మీ స్మైల్’ (నవ్వినప్పుడు చిగుళ్లు కనిపించడం) నాకు ఒక పెద్ద ఇన్ సెక్యూరిటీగా అనిపించేది. కానీ కాలక్రమేణా ఆ ఫీలింగ్ పోయింది’ అని ఆమె సరదాగా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె నిజాయితీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక నిహారిక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, ఆమె నిర్మాతగా సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు తన అన్న వరుణ్ తేజ్తో కలిసి ఒక భారీ ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు సమాచారం. హార్ట్ లో నుంచి వచ్చే కథలే బెస్ట్ స్టోరీస్ అవుతాయని నమ్మే నిహారిక, నిర్మాతగా మరింత ఎత్తుకు ఎదగాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.