Drugs : జైలులోనే డ్రగ్స్ స్కెచ్.. బయటకు వచ్చి మళ్లీ అదే దందా
- జైలులో ఒక్కటైన నైజీరియన్ గ్యాంగ్
- బయటకొచ్చి డ్రగ్స్ వ్యాపారం
- హైదరాబాద్, కర్ణాటక నుంచి యువకులు మాయలో పడిన పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలులోనే డ్రగ్స్ దందాకు స్కెచ్ వేశారు. యస్.. మీరు విన్నది కరెక్టే. ఇద్దరు నైజీరియన్లు.. ముగ్గురు ఇండియన్స్ కలిసి డ్రగ్స్ దందాకు ప్లాన్ చేశారు. అంతే కాదు..జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా.. మళ్లీ అందరినీ కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర.హైదరాబాద్లో డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర ఉంటుంది.
జైలులో ఒక్కటైన బిషప్, రోనాల్డ్ . హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు నైజీరియన్లు పట్టుబడ్డారు. వారిద్దరి పేర్లు బిషప్, రోనాల్డ్. నిజానికి వీరిద్దరూ మెడికల్ వీసా మీద ఒకరు.. చదువుకోవడానికి ఒకరు ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ టు గోవా షటిల్ చేస్తూ డ్రగ్స్ దందా స్టార్ట్ చేశారు. కానీ హైదరాబాద్ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ వేర్వేరుగా జైలుకు పంపించారు. కానీ జైలులో ఇద్దరూ ఒక్కటయ్యారు. వారితోపాటు ఇతర నేరాల్లో జైలుకు వచ్చిన వారిని సైతం పోగు చేసుకుని గ్యాంగ్ ఏర్పాటు చేశారు.. .
హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చిన నేరస్తులకు ఆశ . డ్రగ్స్ అమ్మితే.. భారీగా సంపాదించవచ్చని హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చిన నేరస్తులకు ఆశ కల్పించారు ఇద్దరు నైజీరియన్లు. అక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చే బాధ్యత తమదని.. వాటిని విక్రయించే బాధ్యత మీదని చెప్పారు. జైలులో వేసిన ప్లాన్..బయటకు వచ్చిన తర్వాత అమలు చేశారు. వీళ్లు బయటకు వచ్చిన తర్వాత కొన్ని గ్యాంగులు ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలల నుంచి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించారు. ఎవరికి ఎక్కడ ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా వీళ్లు డ్రగ్స్ దందా స్వేచ్ఛగా చేస్తున్నారు…
Also Read
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
ఐదుగురు సభ్యులు గల ముఠాపైన ఇప్పటికే 10కి పైగా కేసులు. హైదరాబాద్ చెందిన వీర్లపల్లి లక్ష్మీపతి, బొంబాయి చెందిన రోమీ భరత్ కుమార్, కర్ణాటక చెందిన అబ్దుల్ జాఫర్ ఖాన్ ఈ ముగ్గురు మూడు ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముగ్గురికి ఇద్దరు నైజీరియన్లు బిషప్, రోనాల్డ్ కలిసి డ్రగ్స్ తెచ్చి ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో వీళ్ల దందా బాగా పెరిగిపోయింది. అంతేకాదు ఒక్కొక్కరు దాదాపు 100 మంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్తో పాటు ఇద్దరు నైజీరియాలను నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు సభ్యులు గల ముఠాపైన ఇప్పటికే 10 కి పైగా కేసులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మకాం మారుస్తూ వీఐపీ ఉండే చోట్ల నివసిస్తూ సర్వీస్ అపార్ట్మెంట్లో స్టే చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు… తొలుత లక్ష్మీపతిని పట్టుకున్న పోలీసులు.. అతను ఇచ్చిన సమాచారంతో మిగతా గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఫలితంగా గోవా, బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్రలో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాలను కూడా పోలీసులు పట్టుకోగలిగారు..
తాజావార్తలు
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!