గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతుల కూతురు మాల్తీ మేరీ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటకొచ్చింది. మాల్తీ పుట్టిన కొత్తలో దాదాపు మూడున్నర నెలల పాటు హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడిందని నిక్ జోనస్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని నిక్ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Surya : నా లైఫ్ మార్చిన ‘బ్రహ్మ’ ఆయనే.. స్టేజీపై ఎమోషనల్ అయిన హీరో సూర్య!
నిజానికి మాల్తీ ఏప్రిల్లో పుట్టాల్సి ఉండగా, సరోగసీ ద్వారా చాలా ముందుగానే (ప్రీమెచ్యూర్) పుట్టింది. పుట్టినప్పుడు ఆ పాప బరువు కేవలం 765 గ్రాములు మాత్రమే. అంత తక్కువ బరువుతో పుట్టడమే కాకుండా, మాల్తీ శరీరం మొత్తం పర్పుల్ (ఊదా) రంగులోకి మారిపోయిందట. అది కోవిడ్ సమయం కావడంతో నిక్, ప్రియాంకలు షిఫ్టుల వారీగా రోజుకు 12 గంటల పాటు హాస్పిటల్లోనే ఉండేవారు. అలా దాదాపు 100 రోజులకు పైగా ఆ చిన్నారి ఐసీయూలోనే ఉందట.
ఈ మూడున్నర నెలల కాలంలో మాల్తీకి ఆరు సార్లు రక్తమార్పిడి (Blood transfusions) చేశారని, ప్రతిరోజూ తను ప్రాణాల కోసం పోరాడేదని నిక్ వెల్లడించాడు. ఆ గండం నుంచి గట్టెక్కి మాల్తీ ఆరోగ్యంగా ఇంటికి రావడమే ఒక పెద్ద మ్యాజిక్ అని నిక్ అంటున్నాడు. ప్రస్తుతం ప్రియాంక వారణాసిలో షూటింగ్లో బిజీగా ఉండగా, నిక్ నటించిన ‘పవర్ బల్లాడ్’ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది.
