లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఏడు సిక్సర్లతో పూరన్ టీ20 క్రికెట్లో 600 సిక్సర్ల మార్కును దాటాడు. టీ20 కెరీర్లో ఈ మార్క్ను దాటిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. పూరన్ కంటే ముందు ఈ ఘనత సాధించిన ముగ్గురు ఆటగాళ్ళు వెస్టిండీస్కు చెందినవారే కావడం విశేషం. యూనివర్స్ బాస్ గా ప్రసిద్ధి చెందిన క్రిస్ గేల్, ఈ ఫార్మాట్లో 1000 కంటే ఎక్కువ సిక్సర్లు బాది మొదటి స్థానంలో నిలిచాడు.
READ MORE: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ
గేల్ తన కెరీర్లో 455 ఇన్నింగ్స్ల్లో 1056 సిక్సర్లు బాదాడు. పురాన్ తన 359వ ఇన్నింగ్స్లో 600 సిక్సర్ల మార్కును దాటాడు. ఈ జాబితాలో కీరాన్ పొలార్డ్ రెండు, ఆండ్రీ రస్సెల్ మూడో స్థానంలో ఉన్నారు. టీ20ల్లో ఇప్పటివరకు పొలార్డ్ 908 సిక్సర్లు కొట్టగా, రస్సెల్ 733 సిక్సర్లు బాదాడు. టాప్-5లో ఇంగ్లాండ్కు చెందిన అలెక్స్ హేల్స్(552 సిక్సర్లు) ఉన్నాడు.
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వాళ్ల జాబితా…
1056 – క్రిస్ గేల్
908 – కీరాన్ పొల్లార్డ్
733 – ఆండ్రీ రస్సెల్
606 – నికోలస్ పూరన్*
552 – అలెక్స్ హేల్స్
550 – కాలిన్ మున్రో
529 – గ్లెన్ మాక్స్వెల్
525 – రోహిత్ శర్మ
515 – జోస్ బట్లర్
502 – డేవిడ్ మిల్లర్