NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రామేశ్వరం పేలుడు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. సోహెల్ ఎస్బీఐ ఖాతాలో ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం అతడిని రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు.
Read Also: ACB Raids: మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా సొమ్ము స్వాధీనం
వికారాబాద్లో వ్యాపారవేత్తను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పూనా కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గతంలో పలు నేరాలు చేసి శిక్షలు అనుభవించిన వ్యక్తిని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఆంధ్ర, తెలంగాణలో మొత్తం ఐదుగురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.