CM Jagan Lawyer : కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కరెక్టుగా విచారణ జరుపలేదు..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో విజయవాడ NIA కోర్టులో ఇవాళ ( సోమవారం ) విచారణ జరిగింది. సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని.. అలాగే కుట్ర కోణంపైనా దర్యాప్తు చేయలేదని.. కాబట్టి తదుపరి దర్యాప్తు అవసరం ఉందని వాదించారు. ఎన్ఐఏ అధికారులు ఒకే రోజున 35 మంది సాక్ష్యులను విచారించారు.. మూడు బృందాల అధికారులు ఈ విచారణ చేశారని లాయర్ ఇంకొల్లు వెల్లడించారు.
ఛార్జి షీట్ చదివితే తదుపరి దర్యాఫ్తు అవసరమని సాధారణ పౌరుడికి కూడా అర్ధమవుతుంది అని ఆయన పేర్కొన్నారు.
Read Also : Cm Jagan : ఇఫ్తార్ విందుకు సీఎం జగన్ .. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Nithiin : నితిన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - డెబ్యూ డైరెక్టర్స్
- Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
జగన్ వాంగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారు. నిందితుడి జన్మభూమి కమిటీ సిఫార్సుతో తానేకంక గ్రామంలో ఇంటి స్థలం తీసుకున్నాడు.. నిందుతుడు శ్రీనును పథకం ప్రకారమే హర్ష వర్ధన్ చౌదరి రెస్టారెంట్ లోకి తీసుకెళ్లారు.. నిందితుడి గ్రామంలోని ఫ్లెక్సీపై సినీనటుడు ముందుగా చెప్పిన గరుడ ఫోటో ఎందుకు వచ్చింది.. విశాఖ ఎయిర్ పోర్టు అధారిటీ నిందితుడు శ్రీనివాస్ పై కేసు ఉన్నప్పటికీ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారో విచారణ జరపాలి అని సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఫుడ్ అండ్ ఫ్యూజన్ అధినేత, టీడీపీ సానుభూతిపరుడు రామకృష్ణను ఎన్ఐఏ విచారించలేదు.. ఎన్ఐఏ మొదటి వేసిన పిటిషన్ తర్వాత ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదు.. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఈ కేసులో తదుపరి విచారణ జరపాలని కోర్టును కోరారు అని సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Read Also : Telugu Indian Idol: ‘నాటు నాటు’ సాంగ్ రాసిన పెన్ను దక్కింది ఎవరికంటే…
సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో తదుపరి దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ పై వాదనాలు జరిగాయి. 1-1-2019 నాడు ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది. సాక్షులను విచారించింది. తన విచారణ సమయంలోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా విషయాన్ని ఎన్ఐఏ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ విషయాలపై ఎలాంటి విచారణ జరుపకుండానే.. 23-01-2019 ఛార్జీషీట్ దాఖలు చేశారు. మరోవైపు లోకల్ పోలీసులు 10-05-2019న దాడికి ఉపయోగించిన వస్తువులు అప్పగించారు. దాడి జరిగిన ఆరు నెలల తర్వాత ఈ పని చేశారు. ఇలా ఎన్ఐఏ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని లాయర్ వెల్లడించారు. ఈ కేసులో మరింత లోతుగా ఎన్ఐఏ దార్యప్తు చేయాలని కోర్టు తెలిపింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను 20వ తేదికి కోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
-
Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్గా ‘కేరళ’ కింగ్!
-
Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
-
Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!