NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR 100 Rupees Coin: టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకార్థం ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అయ్యారు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నాణేన్ని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.. అయితే, ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కార్యక్రమ అతిథుల జాబితాలో ఎన్టీఆర్ భార్య అయిన తన పేరు కూడా చేర్చాలంటున్నారు నందమూరి లక్ష్మీపార్వతి.. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు లక్ష్మీపార్వతి.
ఎన్టీఆర్తో తన వివాహం, ఎన్నికల్లో గెలుపు, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించిన లక్ష్మీపార్వతి.. ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చకుండా చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవటంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.. కాగా, ఎన్టీఆర్ చిత్రం ఉన్న వంద రూపాయల నాణెంను ఈ నెల 28న విడుదల చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రంతో 100 రూపాయలు నాణాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొనగా.. ఇప్పుడు లక్ష్మీ పార్వతితో లేఖతో కొత్త ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
కాగా, ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన ఆ వంద రూపాయల కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండనుంది.. ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి, 40 శాతం రాగీ, ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పికే పేర్కొన్న విషయం విదితమే.. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం ఉండనుండగా… మరోవైపు ఎన్టీఆర్ చిత్రం.. దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి 1923-2023 అని ముద్రించినట్లుగా ఆర్బీఐ తెలిపింది. అయితే, ఇది హిందీలో రాయబడి ఉంటుంది ఇప్పటికే ఆర్బీఐ పేర్కొన్న విషయం విదితమే.

తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..