New COVID-19 Variant: ఇజ్రాయెల్లో కొత్త కొవిడ్ వేరియంట్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New COVID-19 Variant: ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త కొవిడ్-19 వేరియంట్ను కనుగొన్నట్లు నివేదించింది. ఇందులో ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన రెండు ఉప-వేరియంట్లు ఉన్నాయి. వీటని BA.1, BA.2 అని పిలుస్తారు. ఇటీవల బెన్ గురియన్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన పీసీఆర్ పరీక్షలో ఈ వేరియంట్ గుర్తించబడింది. మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం.. కొవిడ్ -19 యొక్క ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచంలో మరెక్కడా గుర్తించబడలేదు. ఇప్పటివరకు కనుగొనబడిన ఈ రెండు కేసులు జ్వరం, తలనొప్పి,కండరాల నొప్పి వంటి తేలికపాటి లక్షణాలను మాత్రమే ప్రదర్శించాయని, అందువల్ల ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం లేదని ప్రకటన వివరించింది.
ఈ కొత్త వేరియంట్ ఫలితంగా వచ్చే ఏవైనా తీవ్రమైన కేసుల గురించి ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ ప్రజారోగ్య విభాగం అధిపతి డాక్టర్ షారోన్ అల్రోయ్-ప్రీస్ అన్నారు. ఇజ్రాయెల్ 9.2 మిలియన్ల జనాభాలో, నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు ఇప్పటికే మూడు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ను పొందారు. ఈ రోజు వరకు దేశంలో దాదాపు 1.4 మిలియన్ల కొవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి, 8,244 మరణాలు సంభవించాయి. కొవిడ్-19 ఆంక్షలు సడలిస్తున్నందున టీకాలు వేయని పర్యాటకులు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్ గత నెలలో ప్రకటించారు. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Read Also: World Sleep Day: ఉద్యోగులకు కంపెనీ ‘సర్ప్రైజ్ గిఫ్ట్’.. ఈ రోజంతా హాయిగా నిద్రపోవాలంటూ..
డిసెంబర్ 2020లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ప్రారంభించిన మొదటి దేశాలలో ఇజ్రాయెల్ కూడా ఉంది. అయితే, ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల 2021 నవంబర్లో దాని సరిహద్దులను తిరిగి తెరవడానికి చేసిన మునుపటి ప్రయత్నం విఫలమైంది. దీని వలన వాటిని కొన్ని రోజుల్లోనే మళ్లీ మూసివేయవలసి వచ్చింది.ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవల ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులలో గణనీయమైన పెరుగుదల ఉన్నందున, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులతో పాటు, కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోస్ అందించబడుతుందని ప్రకటించింది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!