Suicide : వరకట్న వేధింపులకు నవ వధువు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే మోసం చేయటంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయటంతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్ కాలనీలో నివసించే తాళ్ళపల్లి రాజశేఖర్ ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దే ఉన్న మనీషా(27) అనే యువతిని ప్రేమించటంతో, ఆ యువతి వారి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారు వివాహం గూర్చి ప్రస్తావన పెద్దల వద్దకు తీసుకొని వెళ్ళటంతో రాజశేఖర్, అతని కుటుంబ సభ్యులు కోటీ రూపాయల కట్నం డిమాండ్ చేయగా, మనీషా కుటుంబ సభ్యులు 30 లక్షల కట్నం ఇచ్చేందుకు సమ్మతించారు. మరో యువతి తనను వేధిస్తోందని, వివాహం ఘనంగా వద్దని, ఆర్య సమాజ్ లో చేసుకుందామని రాజశేఖర్ సూచన మేరకు గత నెల 10వ తేదీన ఆర్యసమాజ్ లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అవ్వగానే, రాజశేఖర్ తనను మోసం చేశాడని మరో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Harish Shankar: మీతో మరో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నా.. విశ్వప్రసాద్ కి హరీష్ శంకర్ ట్వీట్
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
జైలు నుండి విడుదల ఇంటికి వచ్చిన రాజశేఖర్, ఇంటికి తిరిగి వచ్చి మనీషా కట్న డబ్బులు తీసుకొని రావాలని వేధింపులకు గురి చేశాడు. వేధింపులు తాళలేక మనీషా ఈ నెల 11వ తేదీన యాసిడ్ తాగగా, ఆమె కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. మనీషా మృతి కారణమైన రాజశేఖర్, అతని తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ తమను ఎవరూ ఏమీ చేయలేరని, మీకు నచ్చిన చోట ఫిర్యాదు చేసుకోండి అని బెదిరింపులకు గురి చేస్తున్నారని మృతురాలి బంధువులు తెలిపారు. నిందితుల పై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు .
Himanta Biswa Sarma: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీపై అస్సాం సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!