Suicide : వరకట్న వేధింపులకు నవ వధువు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే మోసం చేయటంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయటంతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్ కాలనీలో నివసించే తాళ్ళపల్లి రాజశేఖర్ ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దే ఉన్న మనీషా(27) అనే యువతిని ప్రేమించటంతో, ఆ యువతి వారి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారు వివాహం గూర్చి ప్రస్తావన పెద్దల వద్దకు తీసుకొని వెళ్ళటంతో రాజశేఖర్, అతని కుటుంబ సభ్యులు కోటీ రూపాయల కట్నం డిమాండ్ చేయగా, మనీషా కుటుంబ సభ్యులు 30 లక్షల కట్నం ఇచ్చేందుకు సమ్మతించారు. మరో యువతి తనను వేధిస్తోందని, వివాహం ఘనంగా వద్దని, ఆర్య సమాజ్ లో చేసుకుందామని రాజశేఖర్ సూచన మేరకు గత నెల 10వ తేదీన ఆర్యసమాజ్ లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అవ్వగానే, రాజశేఖర్ తనను మోసం చేశాడని మరో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Harish Shankar: మీతో మరో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నా.. విశ్వప్రసాద్ కి హరీష్ శంకర్ ట్వీట్
Also Read
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
జైలు నుండి విడుదల ఇంటికి వచ్చిన రాజశేఖర్, ఇంటికి తిరిగి వచ్చి మనీషా కట్న డబ్బులు తీసుకొని రావాలని వేధింపులకు గురి చేశాడు. వేధింపులు తాళలేక మనీషా ఈ నెల 11వ తేదీన యాసిడ్ తాగగా, ఆమె కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. మనీషా మృతి కారణమైన రాజశేఖర్, అతని తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ తమను ఎవరూ ఏమీ చేయలేరని, మీకు నచ్చిన చోట ఫిర్యాదు చేసుకోండి అని బెదిరింపులకు గురి చేస్తున్నారని మృతురాలి బంధువులు తెలిపారు. నిందితుల పై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు .
Himanta Biswa Sarma: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీపై అస్సాం సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తాజావార్తలు
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!