Himanta Biswa Sarma: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీపై అస్సాం సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- భారత్లోకి బంగ్లాదేశీయులు ప్రవేశంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు
- బంగ్లాదేశ్లోని హిందువులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదు
- టెక్స్టైల్ రంగంలో ఉపాధి కోసం బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు..
- భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు- సీఎం హిమంత బిశ్వ శర్మ.
భారత్లోకి బంగ్లాదేశీయులు ప్రవేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి హిందువులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులు నివసిస్తున్నారు.. వారు పోరాడుతున్నారు. గత నెల రోజులుగా ఒక్క హిందువు కూడా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని అన్నారు.
Read Also: Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అయితే.. టెక్స్టైల్ రంగంలో ఉపాధి కోసం బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. గత నెలలో 35 మంది ముస్లిం చొరబాటుదారులను అరెస్టు చేశామన్నారు. వారు అస్సాంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ అస్సాంలో నివసించేందుకు కాదని, వారు టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేయడానికి అని ముఖ్యమంత్రి బిశ్వ శర్మ చెప్పారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులు దాటుతున్న వారు అస్సాంలో ఆశ్రయం పొందడం లేదని.. బెంగళూరు, తమిళనాడు, కోయంబత్తూరుకు వెళ్లి వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారని హిమంత చెప్పారు. కాగా.. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రధాని మోడీని అభ్యర్థించామని సీఎం చెప్పారు.
Read Also: Satyabhama: వరంగల్లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు
ఈ నెల మొదట్లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం గద్దె దించిన తర్వాత బంగ్లాదేశ్లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ వర్గాలకు చెందిన వారిపై పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుండి 48 జిల్లాల్లో 278 చోట్ల మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై దాడులు జరిగాయని బంగ్లాదేశ్ నేషనల్ హిందూ మహా కూటమి తెలిపింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో