Nepal Protest: నేపాల్ రక్తపాతం.. దేశ హోం మంత్రి రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Protest: నేపాల్లో అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ‘జనరేషన్ – జెడ్ (Gen Z) విప్లవం’గా పేరుపొందింది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంటు సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 12 ఏళ్ల బాలుడు సహా కనీసం 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు .
READ ALSO: Asia Cup 2025: ఆసియా కప్కు వేళయరా.. వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా!
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
వేలాది మంది యువ నిరసనకారులు ఖాట్మండు వీధుల్లోకి వచ్చి, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. ఘర్షణలు తీవ్రం కావడంతో, పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అధికారులు రాజధానిలో కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని నియంత్రించడానికి ఖాట్మండులోని నిరసన ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దేశ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి నివాసంలో అత్యున్నత స్థాయి జాతీయ భద్రతా మండలి సమావేశం జరిగింది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఏక్ నారాయణ్ ఆర్యాల్, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, హోంమంత్రి రమేష్ లేఖక్, విదేశాంగ మంత్రి అర్జు రానా డియోబా, రక్షణ మంత్రి మన్బీర్ రాయ్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగెల్ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం అధికారిక వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ సాయంత్రం దేశ ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన అత్యవసర మంత్రివర్గ సమావేశంలో హెూం మంత్రి రమేష్ లేఖక్ తన రాజీనామాను ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలికి సమర్పించారని వర్గాలు తెలిపాయి. నిరసనల మధ్య, ప్రభుత్వం ఈ సోషల్ మీడియా యాప్లపై నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి.
సెప్టెంబర్ 4న ప్రభుత్వం ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లను నిషేధించాలని తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ యువత ఉద్యమం మొదలు పెట్టింది. ఈ ప్లాట్ఫారమ్లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోకపోవడం వల్ల ఈ నిషేధం విధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా యువత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.
READ ALSO: Shocking Murder: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన మూడో భార్య.. రెండో భార్య ఏం చేసిందంటే!
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!