Balen Shah: సంచలన నిర్ణయం తీసుకొన్న కొత్త ప్రభుత్వం.. వారికి ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు!
- మాట నిలబెట్టుకున్న నేపాల్ ప్రధాని ..
- 27 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balen Shah: నేపాల్ నూతన ప్రధానమంత్రి బాలెన్ షా తనదైన శైలిలో పాలన సాగిస్తూ మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన ‘జెన్ జీ’ (Gen Z) ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 27 మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని ఆయన నిలబెట్టుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో గత ఏడాది సెప్టెంబర్ 8న జరిగిన నిరసన ప్రదర్శనల్లో పోలీసుల కాల్పుల కారణంగా మొదటి రోజే 19 మంది విద్యార్థులు మరణించగా, చికిత్స పొందుతూ మరో 8 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో, బాలెన్ షా ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించింది.
READ ALSO: RBI Plan: రూపాయి విలువ పెంచేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. ఇక దూసుకుపోవడమే..
Also Read
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
అమల్లోకి వచ్చిన నిర్ణయం..
ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే అమలు ప్రక్రియ కూడా వేగవంతమైంది. నేపాల్ ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ’ అధికారిక నోటీసు జారీ చేసింది. మరణించిన 27 మంది విద్యార్థుల సమీప బంధువుల జాబితాను ప్రకటించారు. వారి విద్యార్హత, సామర్థ్యాన్ని బట్టి వారి సొంత జిల్లాల్లోనే ఉద్యోగాలు కల్పించనున్నారు. నియామకం పొందే అభ్యర్థులు 35 రోజుల్లోగా తమ బంధుత్వ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.
మాట నిలబెట్టుకున్న బాలెన్ షా
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అధికారంలోకి రాగానే అమలు చేసి బాలెన్ షా తన రాజకీయ చిత్తశుద్ధిని చాటుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ వంటి కఠిన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఆయన, మరోవైపు బాధితుల పట్ల మానవీయ కోణంలో స్పందించడం నేపాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, విద్యార్థుల మరణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
READ ALSO: Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2!
తాజావార్తలు
-
Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
-
Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!