Nepal : నేపాల్లో పెరిగిన హిందూ రాష్ట్ర డిమాండ్.. అల్లకల్లోలం అక్కడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal : నేపాల్లో రాచరికం, హిందూ దేశం కోసం డిమాండ్ మళ్లీ తీవ్రమైంది. ఇందుకోసం రాజధాని ఖాట్మండులో గురువారం పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో పోలీసులకు, ఆందోళనకారులకు స్వల్ప గాయాలయ్యాయి. 2008లో రద్దు చేయబడిన రాచరికం తిరిగి రావాలని, హిందూ దేశంగా నేపాల్ స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు గుమిగూడారు. వీరిలో ఎక్కువ మంది నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర మద్దతుదారులని చెబుతున్నారు. ప్రదర్శనలో జ్ఞానేంద్రకు అనుకూలంగా వారు నిరంతరం నినాదాలు చేశారు.
Read Also:Rashmika Mandanna: రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో వైరల్.. త్వరలో నిందితుల అరెస్టు
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
‘మాకు రాజరికం కావాలి, గణతంత్రం కాదు’
‘మాకు ప్రాణం కంటే రాజు ముఖ్యమని, మాకు రాచరికం కావాలి, గణతంత్రం కాదు’ అని నిరసనకారులు అన్నారు. నేపాల్ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు మొత్తం పరిపాలనా సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు. అందుకే ఈ విఫలమైన పాలనా వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also:Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలా ? మీ అభిప్రాయం ఏంటి ?
2006లో అధికారాన్ని కోల్పోయిన జ్ఞానేంద్ర
కాలం ఎంత మారిపోయిందో, 2006లో అదే రాజు జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ షా దేవ్ అధికారంలో ఉండగా, ఆయనకు వ్యతిరేకంగా అనేక వారాల పాటు వీధుల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. అప్పటి రాజు జ్ఞానేంద్ర తన పాలనను వదులుకుని ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవలసి వచ్చింది. రెండు సంవత్సరాల తరువాత, కొత్తగా ఎన్నికైన పార్లమెంటు రాచరికాన్ని రద్దు చేయడానికి ఓటు వేసింది. నేపాల్ గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. రిపబ్లిక్ అర్థం ఏమిటంటే, దేశానికి అధిపతి అధ్యక్షుడు, రాజు కాదు. తర్వాత నేపాల్ను హిందూ దేశంగా కాకుండా సెక్యులర్గా ప్రకటించారు. ఇది తాత్కాలిక రాజ్యాంగం సహాయంతో జరిగింది.
తాజావార్తలు
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి