Nepal: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించిన నేపాల్.. కారణమేంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు. ఈ మసాలాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వార్తలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు బ్రాండ్ల మసాలా దినుసుల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. విచారణ నివేదిక వచ్చే వరకు నిషేధం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ భారతీయ మసాలా వినియోగాన్ని సింగపూర్, హాంకాంగ్ నిషేధించాయి. ఈ మసాలా దినుసుల్లో పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ ఉంటుందన్న భయంతో నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సుగంధ ద్రవ్యాలలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిశోధన ప్రారంభించబడింది.
READ MORE: Raghu Rama Krishna Raju: 125 నుంచి 150 సీట్లలో కూటమి విజయం..!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
MDH, ఎవరెస్ట్ పేర్లు దశాబ్దాలుగా చాలా ఫేమస్. ఈ బ్రాండ్ల మసాలా దినుసులు మిడిల్ ఈస్ట్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గతంలో గుర్తించింది. మానవుల ప్రాణాలకు హాని కలుగుజేసే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా ఎస్ఎఫ్ఏ తేల్చింది. దీంతో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను తిరిగి ఇండియాకు పంపించాలని ఆదేశించింది. ప్రస్తుతం తక్కువ మొత్తంలో ఇథిలీన్ ఆక్సైడ్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అయితే దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఏజెన్సీ చెబుతోంది. ఇథిలీన్ ఆక్సైడ్ రంగులేని వాయువు. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఇది తీపి వాసనను ఇస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ప్రకారం.. ఈ వాయువు ఇథిలీన్ గ్లైకాల్ (యాంటీ-ఫ్రీజ్) వంటి రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కాకుండా, దీనిని వస్త్రాలు, డిటర్జెంట్లు, నురుగులు, మందులు, అంటుకునే పదార్థాలు మరియు ద్రావకాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసుల పరిశోధనలు బ్రిటన్, న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జెన్నీ బిషప్ మాట్లాడుతూ.. ఇథిలీన్ ఆక్సైడ్ ఒక రసాయనమని, ఇది మానవులకు క్యాన్సర్ వచ్చేలా చేస్తుందన్నారు. ఈ మసాలాలు తమ దేశంలో కూడా అందుబాటులో ఉన్నాయని ఈ అంశంపై విచారణ మొదలు పెడతామన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!