Nedurumalli Ramkumar Reddy : జగన్ అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పాలనే ప్రజా స్పందనకు నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా నెల్లూరి జిల్లాలోని వెంకటగిరిలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే.. దీనిపై నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమం అనుకున్న దానికంటే విజయవంతమైందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి మా తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మొదట విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జరగడం సంతోషమన్నారు. మా కుటుంబ సభ్యులతో పాటు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అభిమానుల మనసు పులకించిందని, వెంకటగిరి సభకు వచ్చిన ప్రజలను చూసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆశ్చర్యపోయాయన్నారు.
జగన్ అమలు చేస్తున్న పథకాలు..అభివృద్ధి పాలనే ప్రజా స్పందనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వెంకటగిరి నుంచి ఎన్నికల నగరాను జగన్ ప్రారంభించినట్టుగా చెప్పుకోవచ్చని,
నియోజకవర్గంలో ఏడు రోజుల పాటు యువగళం పాదయాత్ర చేసినా ఏడు మంది కూడా వైసీపీ నాయకులు వెళ్ళలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో గెలుపొందామని, అడిగిన వెంటనే వెంకటగిరి నియోజకవర్గం పై జగన్ వరాల జల్లు కురిపించారని ఆయన అన్నారు. అల్తూరిపాడు జలాశయానికి సవరించిన అంచనాలను ఆమోదించారని, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం ప్రజల్లో ఆనందాన్ని నింపిందన్నారు. ముఖ్యమంత్రి మంజూరు చేసిన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపడతామని, మాటల కంటే అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. పెంచలకోనను మరింత అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే 150 ఎకరాల భూమిని అటవీ శాఖ ఇచ్చిందన్నారు రామ్కుమార్ రెడ్డి.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!