NCP MLA Home: ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన నిరసనకారులు
NCP MLA Home: నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది. ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. మేమంతా క్షేమంగా ఉన్నామని, కానీ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
Also Read: Chhattisgarh Assembly Election 2023: నామినేషన్ దాఖలు చేసిన చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మహారాష్ట్రలో ఉద్యోగాలు, విద్యలో మరాఠా కోటాలను కోరుతూ జరిగిన ఆందోళనలు ఇటీవల ముఖ్యాంశాలుగా మారాయి. రిజర్వేషన్ అంశంపై శివసేన నాయకుడు హేమంత్ పాటిల్ హింగోలి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. యవత్మాల్లోని నిరసన వేదిక వద్ద ఆయన తన రాజీనామా లేఖ రాశారు. ఎంపీ రాజీనామాపై స్పందిస్తూ, ప్రస్తుతం నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్, ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా రాష్ట్రంలోని మరాఠా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలని సూచించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరాఠాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి కుట్ర పన్నుతున్నారని మనోజ్ జరంగే పాటిల్ గతంలో అన్నారు. మరాఠా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో జాప్యంపై ఆయన వ్యాఖ్యానించారు. మరాఠా కోటా సమస్య బీడ్ జిల్లాలో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తాజాగా అక్టోబర్ 28న ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: Manish Sisodia : మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. కనీసం ఆర్నెళ్లు జైల్లోనే
ఇంతలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరాఠా సమాజానికి తమ మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం వారి హక్కులను వారికి కల్పిస్తుందని వారికి హామీ ఇచ్చారు. మరాఠాలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో శాశ్వత నిర్ణయం” తీసుకుంటుందని, సమాజానికి హక్కులు కల్పిస్తామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని ఒక రోజు ముందు ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలను దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం మరోసారి పేర్కొన్నారు. మరాఠా రిజర్వేషన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రతిపాదిత క్యూరేటివ్ పిటిషన్ను సమర్పించడంపై ముఖ్యమంత్రి శివసేన వర్గం, బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి ముగ్గురు సభ్యుల నిపుణుల ప్యానెల్ను ఏర్పాటు చేయనున్నట్లు ఏక్నాథ్ షిండే సోమవారం తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!