సౌత్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా నయనతార మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనదైన నటనతో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.ప్రస్తుతం ఈ భామ కెరీర్ ఫుల్ జోషలో ఉంది. ఆమె బాలీవుడ్లో తొలిసారిగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది.షారుక్ ఖాన్ హీరో గా నటించిన జవాన్ మూవీ ఈ ఇప్పటికే రూ. 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. జవాన్ మూవీ ఊపు చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్లో చేరడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జవాన్ లో నర్మద అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది నయనతార. తన గ్లామర్తో పాటు యాక్షన్ సీక్వెన్స్లోనూ అదరగొట్టిందీ ఈ భామ . ప్రస్తుతం జవాన్ సక్సెస్ ఫుల్ హ్యాపీ గా ఉన్న నయన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన భర్త విఘ్నేశ్ శివన్ ధరించిన టీ షర్ట్పై ‘మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి..’ అని రాసి ఉన్న ఫొటోను ఇన్స్టా స్టోరీలో ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నయనతార పోస్ట్కు అర్థం ఏమై ఉంటుంది అని అభిమానులు, నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు.
అయితే గతేడాది విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకోవడం అలాగే ఇద్దరి పిల్లలకు తల్లి కావడం రీసెంట్ గా బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ తో ఎంట్రీ ఇవ్వడం వంటివి నయన్ లైఫ్లో అన్నీ మంచి శకునాలే కనిపిస్తూ ఉన్నాయని..అందుకే ఆమె అలాంటి పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇదిలా ఉంటే సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషకం అందుకుంటోన్న హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 8-10 కోట్లు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇక ‘జవాన్’ చిత్రానికి నయన్ ఏకంగా రూ.11 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. జవాన్ సినిమా సక్సెస్ తర్వాత తన పారితోషికాన్ని మరింతగా పెంచేసిందని తెలుస్తోంది. అలాగే భారీ బడ్జెట్ ల నిర్మాతలు నయనతార కాల్షీట్స్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..జవాన్ సినిమా తర్వాత నయన్ ఇరైవన్ అనే సినిమాలో నటిస్తోంది జయం రవి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు ‘లేడీ సూపర్ స్టార్ 75 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మరో మూవీలో కూడా నటిస్తుంది