Jharkhand: జార్ఖండ్లో నక్సలైట్ల బీభత్సం.. ఐదుగురిని కొట్టి చంపిన మావోలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో అర్థరాత్రి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నెటార్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దావ్నా, పురందీ గ్రామాల్లో హల్ చల్ చేశారు. అంతేకాకుండా ఐదుగురిని పోలీస్ ఇన్ఫార్మర్లు అనే నెపంతో.. వారిని ఇంటి నుంచి తీసుకెళ్లారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టారు. దాంతో దావ్నా గ్రామానికి చెందిన దేవ్ కుమార్ అనే వ్యక్తి మృతిచెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి కొట్టి చంపారా.. కాల్చి చంపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా నక్సలైట్లు మిగిలిన నలుగురిని కూడా కొట్టి చంపారు.
Bhola Shankar: మిల్కీ బ్యూటీ.. అంటూ పాట పాడుతున్న చిరు
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
మరోవైపు నక్సలైట్లను పట్టుకునేందుకు పోలీసులు సరిహద్దు జిల్లా లతేహార్లో నిరంతరం దాడులు చేస్తున్నారు. ఈ ఘటనతో లతేహర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు మూడు రోజులుగా నక్సలైట్లు నిరంతరం గ్రామానికి వస్తున్నారు. దేవ్ కుమార్, బబ్లూ అన్సారీ మరియు మరికొంతమందిని విచారిస్తున్నారు. అయితే గ్రామంలో అందరూ పడుకున్నాక ఈ ఘటనకు పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. భారీ ఆయుధాలతో నక్సలైట్లు సృష్టించిన ఘటనతో గ్రామస్తుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. అంతేకాకుండా నక్సలైట్లు గ్రామస్తులను బెదిరించడంతో ఈ ఘటనను పోలీసులకు చెప్పేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు.
Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
నక్సలైట్ల కోసం జార్ఖండ్ పోలీసులు, CRPF సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై రివార్డులు ఉన్న నక్సలైట్ కమాండర్లను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఎన్కౌంటర్లో కొందరు మావోలు మృతి చెందడంతో భద్రతా బలగాలపై నక్సలైట్లు ఆగ్రహంతో ఉన్నారు. అయితే మావోలు మాత్రం.. గ్రామస్థులు ఇచ్చిన రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు చేస్తున్నారని నక్సలైట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!