Siddaramaiah: అబద్ధాలు చెప్పడంలో మోడీ దిట్ట.. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా కూడా దెబ్బ తీస్తున్నారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోడీ గొప్పవారు.. అబద్ధాలను మార్కెట్ చేయడంలో కూడా ఆయన దిట్ట అంటూ సీఎం సీరియస్ అయ్యారు. అసంబద్ధమైన మాటలు మాట్లాడి ప్రజల మనోభావాలను మోడీ రెచ్చగొడుతున్నారు. ఎదుటి వారి గౌరవాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Germany-India: ఆ నిషేధం ఎత్తివేత.. చిన్న ఆయుధాల కొనుగోలుకు జర్మనీ అనుమతి
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఈ చర్యలు ప్రధాన మంత్రి పదవిపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయని సిద్ధరామయ్య మండిపడ్డారు. మోడీ చేసిన రిజర్వేషన్, మంగళసూత్ర కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది.. ఆయన ( మోడీ)పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రధాని అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదు.. బాగానే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లోనూ తాము ఇచ్చిన ఎన్నికల హామీలే తమను గెలిపిస్తాయని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. అయితే, తాము ఇచ్చిన ఐదు హామీలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో వచ్చింది.. అదే తమ గెలుపుకు సంకేతమన్నారు. ప్రజలు తమ విచక్షణను బట్టి తీర్పు ఇస్తారు.. ఓటర్లు చాలా తెలివైన వారు.. ప్రధాని మోడీ మాయ మాటలు నమ్మరు.. రాజకీయంగా పరిణతి చెందారని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!