Narendra Modi : నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. సభా వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సంగారెడ్డి లో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
Also Read
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
ఉదయం 10 గం.15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10 గం. 40 నిమిషాలకు పటేల్ గూడ చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 11 గంటల నుంచి 11. గం 30 నిమిషాల వరకు NH-161 హైవేని జాతికి అంకితం చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 11.40 నిమిషాలకి విజయ సంకల్ప యాత్ర సభా వేదికపైకి చేరుకోని సభకి ఉద్దేశించి ప్రధాని ప్రసంగం.. 12 గం. 30 నిమిషాలకి ప్రధాని పటేల్ గూడ నుంచి తిరుగుప్రయాణం కానున్నారు.
పటాన్చెరు మండలం పటేల్గూడలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు . 9,021 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని తన బహిరంగ సభలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 1,409 కోట్లతో నిర్మించిన సంగారెడ్డి-నాందేడ్-అకోలా NH-161కి మోదీ అంకితం ఇవ్వనున్నారు. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు ఎన్హెచ్-65ను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు ఆయన పునాది వేయనున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.1,298 కోట్లు. అతను మెదక్-యెల్లారెడ్డి-రుద్రూర్ నుండి NH-765D విస్తరణకు పునాది వేస్తారు. కాగా, సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) సమావేశానికి ఒక రోజు ముందుగానే సమావేశం జరిగే స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. సభ సజావుగా నిర్వహించేందుకు దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరిస్తామని సంగారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ చెన్నూరి రూపేష్ తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
-
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
-
India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!