Narendra Modi : నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. సభా వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సంగారెడ్డి లో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
Also Read
- Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
- Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
- Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
ఉదయం 10 గం.15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10 గం. 40 నిమిషాలకు పటేల్ గూడ చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 11 గంటల నుంచి 11. గం 30 నిమిషాల వరకు NH-161 హైవేని జాతికి అంకితం చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 11.40 నిమిషాలకి విజయ సంకల్ప యాత్ర సభా వేదికపైకి చేరుకోని సభకి ఉద్దేశించి ప్రధాని ప్రసంగం.. 12 గం. 30 నిమిషాలకి ప్రధాని పటేల్ గూడ నుంచి తిరుగుప్రయాణం కానున్నారు.
పటాన్చెరు మండలం పటేల్గూడలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు . 9,021 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని తన బహిరంగ సభలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 1,409 కోట్లతో నిర్మించిన సంగారెడ్డి-నాందేడ్-అకోలా NH-161కి మోదీ అంకితం ఇవ్వనున్నారు. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు ఎన్హెచ్-65ను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు ఆయన పునాది వేయనున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.1,298 కోట్లు. అతను మెదక్-యెల్లారెడ్డి-రుద్రూర్ నుండి NH-765D విస్తరణకు పునాది వేస్తారు. కాగా, సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) సమావేశానికి ఒక రోజు ముందుగానే సమావేశం జరిగే స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. సభ సజావుగా నిర్వహించేందుకు దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరిస్తామని సంగారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ చెన్నూరి రూపేష్ తెలిపారు.
తాజావార్తలు
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!