Narendra Modi : నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. సభా వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సంగారెడ్డి లో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఉదయం 10 గం.15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10 గం. 40 నిమిషాలకు పటేల్ గూడ చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 11 గంటల నుంచి 11. గం 30 నిమిషాల వరకు NH-161 హైవేని జాతికి అంకితం చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 11.40 నిమిషాలకి విజయ సంకల్ప యాత్ర సభా వేదికపైకి చేరుకోని సభకి ఉద్దేశించి ప్రధాని ప్రసంగం.. 12 గం. 30 నిమిషాలకి ప్రధాని పటేల్ గూడ నుంచి తిరుగుప్రయాణం కానున్నారు.
పటాన్చెరు మండలం పటేల్గూడలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు . 9,021 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని తన బహిరంగ సభలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 1,409 కోట్లతో నిర్మించిన సంగారెడ్డి-నాందేడ్-అకోలా NH-161కి మోదీ అంకితం ఇవ్వనున్నారు. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు ఎన్హెచ్-65ను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు ఆయన పునాది వేయనున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.1,298 కోట్లు. అతను మెదక్-యెల్లారెడ్డి-రుద్రూర్ నుండి NH-765D విస్తరణకు పునాది వేస్తారు. కాగా, సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) సమావేశానికి ఒక రోజు ముందుగానే సమావేశం జరిగే స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. సభ సజావుగా నిర్వహించేందుకు దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరిస్తామని సంగారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ చెన్నూరి రూపేష్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!