Narendra Modi : నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. సభా వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సంగారెడ్డి లో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
Also Read
- Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
- CJP Protest: జంతర్ మంతర్ వద్ద సంచలనం.. పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా..
- New Railway Lines: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అదనంగా రెండు రైల్వే లైన్లు.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
- Vaibhav Batting: ‘నా బౌలింగ్లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్కు బౌలింగ్ వేయలేను’..
ఉదయం 10 గం.15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10 గం. 40 నిమిషాలకు పటేల్ గూడ చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 11 గంటల నుంచి 11. గం 30 నిమిషాల వరకు NH-161 హైవేని జాతికి అంకితం చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 11.40 నిమిషాలకి విజయ సంకల్ప యాత్ర సభా వేదికపైకి చేరుకోని సభకి ఉద్దేశించి ప్రధాని ప్రసంగం.. 12 గం. 30 నిమిషాలకి ప్రధాని పటేల్ గూడ నుంచి తిరుగుప్రయాణం కానున్నారు.
పటాన్చెరు మండలం పటేల్గూడలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు . 9,021 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని తన బహిరంగ సభలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 1,409 కోట్లతో నిర్మించిన సంగారెడ్డి-నాందేడ్-అకోలా NH-161కి మోదీ అంకితం ఇవ్వనున్నారు. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు ఎన్హెచ్-65ను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు ఆయన పునాది వేయనున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.1,298 కోట్లు. అతను మెదక్-యెల్లారెడ్డి-రుద్రూర్ నుండి NH-765D విస్తరణకు పునాది వేస్తారు. కాగా, సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) సమావేశానికి ఒక రోజు ముందుగానే సమావేశం జరిగే స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. సభ సజావుగా నిర్వహించేందుకు దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరిస్తామని సంగారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ చెన్నూరి రూపేష్ తెలిపారు.
తాజావార్తలు
-
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్తోనే హైప్!
-
Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
-
Mandula Samuel : కాంగ్రెస్లో కాక రేపిన సామేల్.. కోమటిరెడ్డి బ్రదర్స్పై ఫైర్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
CJP Protest: జంతర్ మంతర్ వద్ద సంచలనం.. పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!