Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం
- ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి
- బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి లోకేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh Visits Vizag Steel Plant Accident Victims: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు కేజీహెచ్ను సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించారు.
కేజీహెచ్లో మృతుల కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి నారా లోకేశ్.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న లోకేశ్.. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే కేజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్.?
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
మృతుల కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్న వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్కు, వామపక్ష నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలకు కేవలం ఆర్థిక సాయం ప్రకటించడం సరిపోదని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన నారా లోకేశ్.. ‘మేము ఇక్కడికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు. బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి వచ్చాం. ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాలా సహాయం అందిస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి బాధ్యులెవరు, భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించగా.. బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్.?
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
-
Asus: Asus Vivobook లైనప్లో కొత్త ల్యాప్టాప్లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!