Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం
- ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి
- బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి లోకేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh Visits Vizag Steel Plant Accident Victims: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు కేజీహెచ్ను సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించారు.
కేజీహెచ్లో మృతుల కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి నారా లోకేశ్.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న లోకేశ్.. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే కేజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read
- IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- Monsoon Cleaning Tips: ఈగలు, చీమలు ఇంట్లోకి వస్తున్నాయా..? నీటిలో ఇవి కలిపితే మంచి ఫలితాలు..
మృతుల కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్న వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్కు, వామపక్ష నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలకు కేవలం ఆర్థిక సాయం ప్రకటించడం సరిపోదని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన నారా లోకేశ్.. ‘మేము ఇక్కడికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు. బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి వచ్చాం. ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాలా సహాయం అందిస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి బాధ్యులెవరు, భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించగా.. బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
-
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!