Nara Lokesh: గల్లీ నాయకులం.. ఢిల్లీ నాయకులం కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: టీడీపీ, బీజేపీ కూటమి బంధం బలంగా ఉందని.. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CPR)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2025లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరింది, అందుకు మద్దతు కొనసాగిస్తుంది. మేము ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతాం. కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా లేదా ఇతర ఎన్నికలైనా.. మా మద్దతు ఎన్డీఏ అభ్యర్థికే అని లోకేష్ అన్నారు. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన నాయకత్వం అన్నింటికీ తేడా చూపిస్తుందని తాము నమ్ముతామని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాను తన ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లి సీపీఆర్ను అభినందించామని లోకేష్ తెలిపారు. అయినప్పటికీ, ఇండియా కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం రాజకీయాలు అని ఆయన అన్నారు. మేము అలాంటి రాజకీయాలకు లొంగిపోమని లోకేష్ తేల్చి చెప్పారు. సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నప్పటికీ, తమ నినాదం “భారత్ ఫస్ట్” అని స్పష్టం చేశారు.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Gen Z protest in Nepal: ఖాట్మండులో రక్తపాతం.. 16 మంది మృతి, వందలాది మందికి గాయాలు!
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి ప్రస్తుతం మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ను నంబర్ 1 రాష్ట్రంగా మార్చడమే ఆయన ఎజెండా అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా చెప్పామని.. మేము ‘గల్లీ నాయకులం’, ‘ఢిల్లీ నాయకులం’ కాదని ఆయన అన్నారు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇక్కడ ఉన్నాం. ఈ పుకార్లన్నింటికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెడదాం అంటూ పేర్కొన్నారు.
అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు 2029లో జరుగుతాయని లోకేష్ గుర్తు చేశారు. 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే ఉంటుందని, తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి చాలా మార్పు తీసుకురాగలడని నేను నమ్ముతాను. చరిత్ర ఇది చూపించింది. సింగపూర్, మలేషియాను చూడండి.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అది చేసి చూపించారు. ప్రధాని మోడీ భారతదేశానికి అవసరమైన సరైన నాయకుడు, సరైన సమయంలో, సరైన చోట ఉన్నారు. మా మద్దతు ఎప్పటికి ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.
A Masterpiece: త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ పెడుతూ “ఎ మాస్టర్ పీస్”!
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!