Nara Bhuvaneshwari: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్.. భావోద్వేగానికి గురైన భువనేశ్వరి
- ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కు అభినందనలు తెలిపిన తల్లి భువనేశ్వరి
- అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తావనే నమ్మకం ఉంది
- రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి.. ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కు అభినందనలు తెలుపుతూ.. భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి.. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తనయుడు లోకేష్ కు అభినందనలు తెలిపిన ఆమె.. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తావనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ప్రజా సేవ చేస్తూనే రాష్ట్రాన్ని సుభిక్ష మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను అని.. పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నా అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Akkada Ammayi Ikkada Abbayi: అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇన్నాళ్లకు కలిశారు!
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
ఇక, ఆంధ్ర ప్రదేశ్లో మహిళలు గతంలో న్యాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పరిస్థితి మారిపోయింది అన్నారు భువనేశ్వరి.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఇక తగ్గినట్లే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోంమంత్రి అనిత, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.. మహిళల భద్రత పట్ల మీ నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను అని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కీలకంగా పనిచేసిన నారా లోకేష్.. తాను మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు.. ఇక, చంద్రబాబు కేబినెట్లో కీలకమైన మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలు దక్కించుకున్నారు నారా లోకేష్.. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నెం.208లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ- విద్యార్థి సంఘాల నేతలు అభినందించారు.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!