Nara Bhuvaneshwari: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్.. భావోద్వేగానికి గురైన భువనేశ్వరి
- ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కు అభినందనలు తెలిపిన తల్లి భువనేశ్వరి
- అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తావనే నమ్మకం ఉంది
- రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి.. ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కు అభినందనలు తెలుపుతూ.. భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి.. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తనయుడు లోకేష్ కు అభినందనలు తెలిపిన ఆమె.. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తావనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ప్రజా సేవ చేస్తూనే రాష్ట్రాన్ని సుభిక్ష మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను అని.. పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నా అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Akkada Ammayi Ikkada Abbayi: అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇన్నాళ్లకు కలిశారు!
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఇక, ఆంధ్ర ప్రదేశ్లో మహిళలు గతంలో న్యాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పరిస్థితి మారిపోయింది అన్నారు భువనేశ్వరి.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఇక తగ్గినట్లే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోంమంత్రి అనిత, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.. మహిళల భద్రత పట్ల మీ నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను అని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కీలకంగా పనిచేసిన నారా లోకేష్.. తాను మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు.. ఇక, చంద్రబాబు కేబినెట్లో కీలకమైన మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలు దక్కించుకున్నారు నారా లోకేష్.. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నెం.208లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ- విద్యార్థి సంఘాల నేతలు అభినందించారు.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!