Nara Bhuvaneshwari: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్.. భావోద్వేగానికి గురైన భువనేశ్వరి
- ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కు అభినందనలు తెలిపిన తల్లి భువనేశ్వరి
- అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తావనే నమ్మకం ఉంది
- రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి.. ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కు అభినందనలు తెలుపుతూ.. భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి.. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తనయుడు లోకేష్ కు అభినందనలు తెలిపిన ఆమె.. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తావనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ప్రజా సేవ చేస్తూనే రాష్ట్రాన్ని సుభిక్ష మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను అని.. పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నా అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Akkada Ammayi Ikkada Abbayi: అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇన్నాళ్లకు కలిశారు!
Also Read
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ఇక, ఆంధ్ర ప్రదేశ్లో మహిళలు గతంలో న్యాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పరిస్థితి మారిపోయింది అన్నారు భువనేశ్వరి.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఇక తగ్గినట్లే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోంమంత్రి అనిత, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.. మహిళల భద్రత పట్ల మీ నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను అని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కీలకంగా పనిచేసిన నారా లోకేష్.. తాను మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు.. ఇక, చంద్రబాబు కేబినెట్లో కీలకమైన మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలు దక్కించుకున్నారు నారా లోకేష్.. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నెం.208లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ- విద్యార్థి సంఘాల నేతలు అభినందించారు.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?