వయసు చిన్నదే అయినా ఆమె ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించేలా చేసింది. ఆమెలో ఉన్న టాలెంట్తో రెండు క్లాసులు ఎగబాకి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అసలు ఆమె ఎవరు? ఆమె సాధించిన రికార్డులేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
నందిని అగర్వాల్. మధ్యప్రదేశ్లోని మొరెనా నగరానికి చెందిన వాసి. ప్రస్తుతం 19 ఏళ్లు. పాఠశాల వయసులోనే రెండు తరగతుల్ని ఎగబాకి 13వ ఏట 10వ తరగతి.. 15వ ఏట ఇంటర్ పూర్తి చేసింది. అనంతరం 19వ ఏటలోనే ప్రపంచంలోనే అతి పిన్ని వయసులో మహిళా చార్టర్డ్ అకౌంటెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సొంతం చేసుకుంది. ఇక 2021లో సీఏ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించి ప్రశంసలు పొందింది. నందిని అగర్వాల్ 2021లో తన చార్టర్డ్ అకౌంటింగ్ ఫైనల్ పరీక్షలో 800కి 614 (76.75%) స్కోర్ చేసింది . ఆమె 83,000 మంది అభ్యర్థులను ఓడించి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. బాల్యం నుంచి అన్నింటిలో మెరుపు వేగంతో దూసుకుపోతుంది.
నందిని 11వ తరగతి చదువుతున్నప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ తన పాఠశాలను సందర్శించినట్లు గుర్తుచేసుకుంది. ఆ క్షణం నుంచి గిన్నిస్ రికార్డును సాధించాలని కలలు కనినట్లు తెలిపింది. అత్యంత డిమాండ్ ఉన్న CA పరీక్షలలో ఒకదానిపై తన మనసును పెట్టుకుని సాధించింది. తన సోదరుడి సపోర్టుతో ఈ విజయాన్ని సాధించినట్లుగా ఆమె చెప్పింది.
నందిని సోదరుడు సచిన్.. 21, 2021లో AIRలో 18వ ర్యాంక్ సాధించాడు. 800కి 568 మార్కులు సాధించాడు. తోబుట్టువులు విక్టర్ కాన్వెంట్ స్కూల్లో పూర్వ విద్యార్థులు. అక్కడ వారు 2017లో 12వ తరగతిలో 94.5% సాధించి మొరెనా జిల్లాలో అగ్రస్థానంలో ఉన్నారు. వారిద్దరూ కలిసి 12వ తరగతి పూర్తి చేశారు. నందిని రెండు తరగతులకు ఎగబాకి తాజా ఘనత సాధించింది. ఆమె తండ్రి నరేష్ చంద్ర గుప్తా, టాక్స్ ప్రాక్టీషనర్. ఆమె తల్లి డింపుల్ గుప్తా గృహిణిగా ఉన్నారు.