Balayya : దిల్ రాజు బ్యానర్ లో మలయాళ దర్శకుడితో బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య మరో షాకింగ్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : Akkineni Akhil : తాత కాబోతున్న ‘అక్కినేని అఖిల్’..
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
మలయాళంలో ‘మార్కో‘ చిత్రంతో భారీ సంచలనం సృష్టించిన యువ దర్శకుడు హనీఫ్ అదేనీ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. హనీఫ్ అదేనీ తన మేకింగ్ స్టైల్తో యాక్షన్ సినిమాలకు సరికొత్త డెఫినిషన్ ఇస్తారనే పేరుంది. ఇప్పుడు బాలయ్య మార్క్ మాస్ ఎనర్జీకి హనీఫ్ స్టైలిష్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లో అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పై నిర్మించనున్నాడట. బాలయ్య మరియు దిల్ రాజు కాంబినేషన్లో సినిమా కోసం నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. హనీఫ్ అదేనీ కథలోని ఇంటెన్సిటీ బాలయ్యకు బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లేనని ఫిలిం నగర్ వర్గాల టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబందించి అదిరాకారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబో ఫిక్స్ అయితే మాత్రం బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అనే చెప్పాలి. తెలుగుతో పాటు మలయాళంలోను తెరకెక్కించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!