Nama Nageswara Rao: కాంగ్రెస్ మాయ మాటలకు ప్రజలు మోసపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ ను ఎలాగైనా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పై ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విరుచుకు పడ్డారు. మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మటంతో పెద్ద నష్టం జరిగిపోయిందన్నారు. రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేలకు పెంచిన ఘనత కేసీఆర్ దే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడుగ బలహీన వర్గాల అభివృద్ధి కి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలిపారు.
READ MORE: Nandamuri Balakrishna: గుడ్లూరులో బాలయ్య ప్రచారం.. ప్రభుత్వంపై పంచ్లు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ప్రజలు జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటు వేయాలని సూచించారు. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోరాడలేదని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చే సరికి హైద్రాబాద్ నుండి దిగుమతి చేశారని తెలిపారు. తెచ్చిన సూట్ కేస్ తో ఎన్నికలు అయిన తరువాత తిరిగి వెళ్ళిపోతారని విమర్శించారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నామా నాగేశ్వరరావు కంకణం కట్టుకున్నారు. ఈయన గతంలో ఖమ్మం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2009లో తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో మళ్లీ బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రేణుక చౌదరిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!