Nallu Indrasena Reddy : కేసీఆర్ కంటే పెద్ద దగా కొరు పార్టీ కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ కంటే పెద్ద దగా కొరు పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ అప్లికేషన్ పెట్ట లేదని, పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ రాసిన లెటర్ ఉంటే బయట పెట్టాలన్నారు ఇంద్రసేనారెడ్డి, నీకు ( రేవంత్) కవిత కి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని, ఓటు కు నోట్ కేసులో రేవంత్ బయటికి వచ్చిన తర్వాత కేసు ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. మీకు బీఅర్ఎస్ తో బిజినెస్ సంబంధాలు లేవా? కేసిఆర్ తో పొత్తు పెట్టుకొని వాళ్ళతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాదా? అని ఆయన ఇంద్రసేనా రెడ్డి అన్నారు.
Also Read : Pakistan: భారత్ని చూసి పాక్ అసూయ.. చివరకు సౌదీ ప్రిన్స్ కూడా పట్టించుకోలేదు..
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
అంతేకాకుండా.. ‘ఎవరికీ ఎవరితో సంబంధాలు ఉన్నాయి అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికల తర్వాత బీ అర్ ఎస్ కాంగ్రెస్ లు కలుస్తాయి. కలుస్తారు అని చెప్పడానికి గతంలో జరిగిన ఎన్నికలే ఉదాహరణ. బీజేపీ అభ్యర్థుల అప్లికేషన్ తేదీ పొడిగింపు పై ఎటువంటి చర్చ జరగలేదు. కిసాన్ సర్కార్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది సరిపోక దేశ వ్యాప్తంగా మోసానికి బయల్దేరారు కేసీఆర్. కేంద్రం ఇచ్చే ఎరువుల సబ్సిడీ అందకుండా చేస్తున్న దుష్టుడు కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టి సొమ్మసిల్లిన రైతులు. అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్న మోడీ. ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ నీ బస్త మీద ముద్రిస్తున్నరు. ఈ విషయం రైతులకు తెలియకూడదు అని ప్రయత్నం చేస్తున్న బీ అర్ ఎస్ ప్రభుత్వం.
Also Read : Lifestyle : ప్రపోజ్ చేసిన వెంటనే అమ్మాయిలు ఎందుకు ఒప్పుకోరో తెలుసా?
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. గతంలో ఎరువుల కొరత ఉండేది. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. మూత పడ్డ 5ఎరువుల కర్మాగారాలను రీ ఓపెన్ చేసిన మోడీ. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేయమని డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చాక దాన్ని మర్చిపోయారు. రైతులకు ఎరువులన్ని ఫ్రీ గా ఇస్తామని కేసిఆర్ చెప్పిన విడియో ను ప్లే చేసి చూపించిన నల్లు ఇంద్రసేనారెడ్డి. చేతగాని తనం తోనే కేంద్రం ఇచ్చే ఎరువులను రైతులకు ఇవ్వని కేసీఆర్. కేసీఆర్ కి రాజకీయం తప్ప ఏమీ ఇంకేమి చేతకాదు. మార్క్ ఫెడ్ లో ఉన్న ఎరువులను 24 గంటల్లో రైతులకు ఇవ్వాలి. లేదంటే రైతులకు నేరుగా మేమే వాటిని పంచుతం. రాజకీయం ఉంటే పార్టీల తరపున కొట్లడదం. రైతులతో చెలగాటం వద్దు.’ అని ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!