Pakistan: భారత్ని చూసి పాక్ అసూయ.. చివరకు సౌదీ ప్రిన్స్ కూడా పట్టించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ ఎదుగుదలను చూసి అక్కడి ప్రజలు అసూయ వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఒకేసారి స్వాతంత్య్రం పొందినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం ప్రజాస్వామ్యం మాటున సైన్యం రాజ్యమేలుతోంది. చివరకు 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో ఎదిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత ఉంది. చివరకు ప్రజలకు నిత్యావసరాలు, కరెంట్, గ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. ఒక వేళ ఉన్నా కూడా ధరలు చుక్కలను అంటుతోంది.
తాజాగా జీ20 సమావేశాలను ఇండియా నిర్వహించింది. ఈ సమావేశాలకు సంబంధించిన వార్తలు పాకిస్తాన్ మీడియాలో విస్తృతంగా కవరయ్యాయి. ప్రపంచ దేశాధినేతలు భారత్ కు తరలివస్తుండటంపైస అక్కడి ప్రజలు కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానెళ్లు ఈ సమావేశాల గురించి తమ ప్రజల మనోభావాలను తెలుసుకున్నాయి. పాకిస్తాన్, భారత్ తో పోలిస్తే కొన్నేళ్లు వెనకబడి ఉందని చెబుతూనే, కొంతమంది భారత్ పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
Also Read
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
Read Also: Pakistan: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్తాన్లో ఖతం
ఈ జీ20 సమావేశంలో భారత్-మిడిల్ ఈస్ట్-యూరోపియన్ యూనియన్ కారిడార్ రూపంలో పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తాకింది. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)కి ప్రత్యామ్నాయంగా ఈ ఆర్థిక కారిడార్ ను అమెరికా, భారత్, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. ఈ కారిడార్ లో పోర్ట్-రైల్ ప్రాజెక్టులు ఉన్నాయి. భారత్ ను అరబ్, గల్ఫ్ దేశాలతో నౌకామార్గం ద్వారా అనసంధానించడం, అరబ్, గల్ఫ్ ప్రాంతాలను యూరోపియన్ దేశాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానించడం ఈ ప్రాజెక్టులో భాగం. భారత్ ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే.. పాకిస్తాన్ మాత్రం చైనా నిర్మిస్తున్ సీపెక్, గ్వాదర్ పోర్టులతో ఆర్థికంగా నిండా మునిగిపోతుంది.
మరోవైపు తన మిత్రదేశం అని పాకిస్తాన్ పదేపదే చెబుతున్న సౌదీ అరేబియా కూడా ఆ దేశాన్ని పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్) జీ20 సమావేశాల కోసం నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిజానికి పాకిస్తాన్ ఇస్లామాబాద్ వెళ్లి రావాల్సిన ఎంబీఎస్ అక్కడ ఆగకుండా నేరుగా భారత్ రావడం, ప్రధాని మోడీని ఆత్మీయంగా కౌగిలించుకోవడం పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టేంక్కేందుకు పాక్, సౌదీ నుంచి 25 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా వస్తాయని భావించింది. ఈ డీల్ గురించి ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉన్నా సౌదీ ప్రిన్స్ అక్కడికి వెళ్లలేదు. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ పౌరులు ట్విట్టర్ వేదికగా భారత్ ప్రతిష్ట పెరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఎదుగుదలను చూసి ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానని, పాకిస్తాన్ కి మెరుగైన నాయకత్వం, జవాబుదారీతనం కావాలని ఒక నెటిజన్ తన ఎక్స్(ట్విట్టర్)లో రాశాడు.
తాజావార్తలు
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!