Pakistan: భారత్ని చూసి పాక్ అసూయ.. చివరకు సౌదీ ప్రిన్స్ కూడా పట్టించుకోలేదు..
Pakistan: పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ ఎదుగుదలను చూసి అక్కడి ప్రజలు అసూయ వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఒకేసారి స్వాతంత్య్రం పొందినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం ప్రజాస్వామ్యం మాటున సైన్యం రాజ్యమేలుతోంది. చివరకు 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో ఎదిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత ఉంది. చివరకు ప్రజలకు నిత్యావసరాలు, కరెంట్, గ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. ఒక వేళ ఉన్నా కూడా ధరలు చుక్కలను అంటుతోంది.
తాజాగా జీ20 సమావేశాలను ఇండియా నిర్వహించింది. ఈ సమావేశాలకు సంబంధించిన వార్తలు పాకిస్తాన్ మీడియాలో విస్తృతంగా కవరయ్యాయి. ప్రపంచ దేశాధినేతలు భారత్ కు తరలివస్తుండటంపైస అక్కడి ప్రజలు కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానెళ్లు ఈ సమావేశాల గురించి తమ ప్రజల మనోభావాలను తెలుసుకున్నాయి. పాకిస్తాన్, భారత్ తో పోలిస్తే కొన్నేళ్లు వెనకబడి ఉందని చెబుతూనే, కొంతమంది భారత్ పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Pakistan: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్తాన్లో ఖతం
ఈ జీ20 సమావేశంలో భారత్-మిడిల్ ఈస్ట్-యూరోపియన్ యూనియన్ కారిడార్ రూపంలో పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తాకింది. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)కి ప్రత్యామ్నాయంగా ఈ ఆర్థిక కారిడార్ ను అమెరికా, భారత్, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. ఈ కారిడార్ లో పోర్ట్-రైల్ ప్రాజెక్టులు ఉన్నాయి. భారత్ ను అరబ్, గల్ఫ్ దేశాలతో నౌకామార్గం ద్వారా అనసంధానించడం, అరబ్, గల్ఫ్ ప్రాంతాలను యూరోపియన్ దేశాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానించడం ఈ ప్రాజెక్టులో భాగం. భారత్ ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే.. పాకిస్తాన్ మాత్రం చైనా నిర్మిస్తున్ సీపెక్, గ్వాదర్ పోర్టులతో ఆర్థికంగా నిండా మునిగిపోతుంది.
మరోవైపు తన మిత్రదేశం అని పాకిస్తాన్ పదేపదే చెబుతున్న సౌదీ అరేబియా కూడా ఆ దేశాన్ని పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్) జీ20 సమావేశాల కోసం నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిజానికి పాకిస్తాన్ ఇస్లామాబాద్ వెళ్లి రావాల్సిన ఎంబీఎస్ అక్కడ ఆగకుండా నేరుగా భారత్ రావడం, ప్రధాని మోడీని ఆత్మీయంగా కౌగిలించుకోవడం పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టేంక్కేందుకు పాక్, సౌదీ నుంచి 25 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా వస్తాయని భావించింది. ఈ డీల్ గురించి ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉన్నా సౌదీ ప్రిన్స్ అక్కడికి వెళ్లలేదు. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ పౌరులు ట్విట్టర్ వేదికగా భారత్ ప్రతిష్ట పెరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఎదుగుదలను చూసి ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానని, పాకిస్తాన్ కి మెరుగైన నాయకత్వం, జవాబుదారీతనం కావాలని ఒక నెటిజన్ తన ఎక్స్(ట్విట్టర్)లో రాశాడు.
తాజావార్తలు
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!