Nallapareddy: నమ్ముకున్న వారిని మోసం చేయడమే చంద్రబాబు నైజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లాను నల్లపరెడ్డి కుటుంబం ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలందరికీ తెలుసు అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. కోవూరులో మా నాన్న శ్రీనివాసులు రెడ్డిని మూడుసార్లు, మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. నెల్లూరు జిల్లాకు తెలుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత మా తండ్రిదే.. మహిళలంటే మాకు చాలా గౌరవం.. నమ్ముకున్న వారిని మోసం చేయడం చంద్రబాబు నైజం అని ఆయన ఆరోపించారు. కోవూరులో మూడు సంవత్సరాల పాటు దినేష్ రెడ్డిని తిప్పారు.. టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.. చివరకు మొండి చేయి చూపి ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇచ్చారు.. వెంకటగిరిలో కూడా నన్ను ఇదేవిధంగా చంద్రబాబు మోసం చేశారు.. అప్పట్లో నాకు టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో సినీ నటి శారదను రంగంలోకి దించారు అని రాజేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Bihar: చెప్పుడు మాటలు విని కన్న కూతురిని హత్య చేసిన తండ్రి..
Also Read
నల్లపరెడ్డి కుటుంబం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రశాంతి రెడ్డి తెలుసుకోవాలి అని రాజేంద్ర కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజలు అన్నీ ఆలోచించి ఈసారి ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. మరోసారి కోవూరులో మా అన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం సాధిస్తాడు అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయడమే మాకు తెలుసు.. అలాంటిది మాపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు లాగా తప్పుడు పనులు చేసే వ్యక్తులం తాము కాదన్నారు. రాష్ట్రంలో మరోసారి సీఎం జగన్ పరిపాలనలో పరుగులు పెట్టిస్తారని చెప్పారు. ఈసారి 175 కి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టిస్తుందని నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!