Naga Chaitanya : పెళ్లయిన వెంటనే ముంబైకి నాగచైతన్య, శోభిత
- అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లిలో సో చై సందడి
- సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలకు ఫోజులిచ్చిన కొత్త జంట
- త్వరలో తండేల్ తో రాబోతున్న నాగ చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట పెళ్లి వేడుక తెలుగు సాంప్రదాయం ప్రకారం కనులపండువగా సాగింది. ఈ వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. చైతు శోభిత పెళ్లిలో కంజీవరం పట్టు చీరలో శోభిత చాలా అందంగా కనిపించింది, నాగ చైతన్య తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. డిసెంబర్ 6 ఉదయం ఏపీలోని శ్రీశైలం ఆలయంలో ఆశీర్వాదం తీసుకుంది ఈ నూతన జంట. కొత్త జంట మొదటిసారి శివాలయంలో భక్తి పారవశ్యంలో కనిపించారు. పెళ్లయి ఇంకా వారం అయినా కాలేదు. ఇంతలోనే ఈ జంట ముంబైకి వెళ్లింది. బాలీవుడ్ టాప్ డైరక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ పెళ్లిలో సందడిగా కనిపించారు. తన దీర్ఘకాల భాగస్వామి షేన్ గ్రెగోయిర్ను ఆలియా కశ్యప్ ముంబైలో అందమైన సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి అందాల హీరోయిన్లు సహా పలువురు టాప్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. టాలీవుడ్ నుంచి శోభిత- నాగచైతన్య జంట విశేష అతిథులుగా సందడి చేశారు. ఈవెంట్ లో చై అందంగా స్మైలిస్తూ సూట్ లో ఇస్మార్ట్ గా కనిపించగా, శోభిత ట్రెడిషనల్ పంజాబీ డ్రస్ లో ఎంతో ముచ్చటగా కనిపించింది. సో చై జంట ఫోటోగ్రాఫర్లను ఫోజులిచ్చారు.
Read Also:Mangampet Incident: ఓ తండ్రి తీర్పు.. మంగంపేట హత్య కేసులో మరో ట్విస్ట్
Also Read
ఆలియా – షేన్ గతేడాది ముంబైలో ఒక ప్రైవేట్ వేడుకలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మే 2023లో ఇన్స్టాగ్రామ్లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. కెరీర్ విషయానికి వస్తే శోభిత చివరిసారిగా లవ్ సితారలో నటించారు. చైతన్య త్వరలో `తండేల్`తో థియేటర్లో సందడి చేశారు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఆలియా కశ్యప్ పెళ్లికి సో చై జంటకు ఆహ్వానం ఎలా అందింది? అంటే.. శోభితకు ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. అనురాగ్ తన 2016 క్రైమ్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0తో శోభితకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు. తరువాత నెట్ఫ్లిక్స్ ఇండియా 2020 హారర్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్లో అనురాగ్ సెగ్మెంట్ లో ఆమె నటించింది. అనురాగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన గీతూ మోహన్దాస్ 2019 మలయాళ యాక్షన్ థ్రిల్లర్ `మూథోన్`లో కూడా శోభిత హీరోయిన్ గా నటించింది. హిందీ చిత్ర సీమలో శోభిత మనుగడకు అనురాగ్ కీలక సహకారం అందించారు. అలా అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ కి శోభిత సన్నిహితురాలైంది.
Read Also:Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!