Nadendla Manohar: 10.64 లక్షల పెన్షన్లు దారి మళ్లింపు..! జనసేన తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది జనసేన పార్టీ.. సుమారు 10.64 లక్షల మంది అర్హులైన పెన్షన్దారుల సొమ్మును దారి మళ్లించారని జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు.. జగన్ చేసేదంత గోరంత, చెప్పేదేమో కొండంత.. స్కీంల పేరుతో ఈ ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడుతోంది. రూ. 3 వేలకు పెన్షన్ పెంచుతూ ఇటీవలే కేబినెట్ ఆమోదించింది. పెంచిన పెన్షన్ను 54.69 లక్షల మందికి వర్తింప చేస్తూ కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. కానీ, 65.33 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి ప్రకటించారని విమర్శించారు. ఈ ఏడాది నవంబరులో 54.69 లక్షల మందికి రూ. 2750 చొప్పున ఇచ్చామని లెక్కలు చెబుతున్నాయి. కానీ, నవంబర్ నెలలో మాసానికి 65.33 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి చెల్లుబోయిన ప్రకటించారని.. ఈ పెన్షన్ లెక్కల్లో తేడాలేంటి? అని నిలదీశారు.
Read Also: Viral Video : పెళ్లిలో పన్నీర్ లేదని పొట్టు పొట్టుకున్న బంధువులు.. వామ్మో ఏందయ్యా ఇది..
Also Read
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
ఎన్ని పెన్షన్లకు ఆమోదం తీసుకుంటున్నారు..? ఎంత మంది పెన్షన్ నిధులు స్వాహా చేస్తున్నారు..? అంటూ ప్రశ్నించారు నాదెండ్ల.. కేబినెట్లో కూర్చుని పెన్షన్ల గురించి చర్చించిందెంత..?ఆమోదించించిందెంత..? అని ప్రశ్నించారు. 10.64 లక్షల మంది అర్హత కలిగిన వారిని మోసం చేసి, నెలకు రూ. 292 కోట్లు గుటకాయ స్వాహా చేశారని దుయ్యబట్టారు. పేద ప్రజలను లెక్కల గారడీలతో మోసం చేయడం దుర్మార్గం కాదా..? వీటికి సీఎం, ఇతర మంత్రులు ఏం సమాధానం చెబుతారు..? మంత్రి వర్గ సమావేశంలోనే పొంత లేని గణాంకాలను ఎలా చెప్పారు.. సమావేశంలో ఒక అంకెలు, బయటకు వచ్చి మరో అంకెలా..? అంకెల గారడీతో ఇంకెంత దోచుకుంటారు..? బటన్ నొక్కడం ద్వారా ఎవరి ఖాతాల్లోకి ఎంత వెళుతున్నాయో అర్దం కావడంలేదని కీలక అధికారులే చెబుతున్నారు. కేబినెట్ తీర్మానంలోనే ఇంత మతలబులు ఉంటే.. ఎవరిని అడగాలి..? ఈ పెన్షన్ల బాగోతానికి సీఎం బయటకు వచ్చి సమాధానం చెబుతారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేబినెట్లో చేసిన తీర్మానాలను కూడా వక్రీకరిస్తూ.. దొంగ లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్లో ‘ఫౌజీ’ పోస్ట్ప్రొడక్షన్ వర్క్!
-
Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
-
Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!