Nadendla Manohar: సెప్టెంబర్ లోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోంది అని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ తో కేంద్ర పెద్దలు చర్చించారు.. దీనిపై లోతైన చర్చ జరగాలి.. ప్రజా ధనం ఆదా అవ్వాలి.. పార్లమెంటులో కూడా చర్చ జరిగి.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశానికి కూడా మంచి జరుగుతుంది.. జనసేన తరపున ఈ విధానాన్ని సమర్ధిస్తున్నామని నాదేండ్ల అన్నారు. జమిలీ ఎన్నికలపై చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది.. కేంద్రంలో ఉన్న నాయకత్వం దీనిపై బలంగా ముందుకు వెళుతున్నారు.. ఇది మంచి నిర్ణయం.. కాబట్టి మార్పులు చేస్తారని భావిస్తున్నామని మనోహర్ తెలిపారు.
Read Also: INS Mahendragiri: నౌకాదళంలోకి మరో యుద్ధనౌక.. ముంబయితీరంలో ‘మహేంద్రగిరి’ జలప్రవేశం
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. జనసేన సిద్దంగా ఉంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల ద్వారా ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని భావిస్తున్నాం.. సెప్టెంబర్ లోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వారాహి యాత్రపై మా నాయకులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం.. పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు.. పరిస్థితులను బట్టి మా విధానాలు మాకుంటాయని అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగేలా, ప్రజా ప్రభుత్వం ఏర్పడేలా జనసేన విధానం ఉంటుంది అని నాదేండ్ల మనోహార్ వెల్లడించారు.
Read Also: Mannara Chopra: డైరెక్టర్ ముద్దు.. మన్నారా చోప్రా షాకింగ్ కామెంట్స్.. బేటీ బేటీ అంటూ?
రేపు మా అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహార్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రేపు చేపడతాం.. రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి ఆలోచనతో అన్ని నియోజకవర్గాల్లో పవన్ పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నాం.. పవన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేస్తామని ఆయన తెలిపారు. రెల్లి కార్మికులు ఎంతో కష్టపడి సమాజానికి వారు సేవ చేస్తున్నారు.. వారి కష్టాన్ని గుర్తించి వారికి అండగా ఉంటామని పవన్ గతంలో చెప్పారు.. వారి మధ్య పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుతామని నాదేండ్ల పేర్కొన్నారు. యువతకు స్పూర్తి వంతంగా ఉండేలా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు.
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?