Nadendla Manohar: పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై నాకు సమాచారం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భీమిలిలో సిద్దం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఏర్పాటు చేశారు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పంచింగ్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం సీఎం జగన్ పొందుతున్నారు.. పరిపాలన వదిలి ప్రజలను రెచ్చ గొట్టే పని చేస్తున్నారు.. జగన్ సిద్దం సభను నాన్ సీరియస్ గా చేశారు.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధమయ్యారు అని ఆయన చెప్పుకొచ్చారు. సంస్కారం లేని వ్యక్తిగా జగన్ మారిపోయారు.. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.. రూ. 91,253 కోట్లకు లెక్కలు లేవు.. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఏమైంది కూడా తెలియదు.. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు అని నాదేండ్ల మనోహర్ అన్నారు.
Read Also: Kota: “మమ్మీ, డాడీ, ఈ జేఈఈ నావల్ల కాదు”.. కోటాలో మరో ఆత్మహత్య..
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
ప్రభుత్వ లెక్కలపై చర్చకు జనసేన సిద్దం అని నాదేండ్ల మనోహర్ తెలిపారు. బెజవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సిద్దం అంటూ సవాల్ చేశారు. సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపై మాటల దాడులు సరికాదు.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ చర్చకు రావాలని సీఎంను కోరుతున్నాం.. ఏపీ ప్రభుత్వాన్ని కొన్ని సంస్థలు బ్యాన్ చేశాయి.. చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి లెక్కల్లో కనపడని డబ్బుపై సమగ్ర విచారణ చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, జనసేన – టీడీపీ సీట్లపై సైతం నాదెండ్ల స్పందించారు. చంద్రబాబు- పవన్ కలిసి చర్చించి సీట్లపై ప్రకటన చేస్తారు.. త్వరలోనే సీట్ల ప్రకటన ఉంటుంది.. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే మేం కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాం.. పవన్ ఢిల్లీ టూర్ పై నాకు సమాచారం లేదన్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలి అని మాత్రమే పవన్ అన్నారు.. సీట్ల ప్రకటన విషయంలో మా పార్టీ నేతల మనోభావాల ప్రకారం పవన్ రియాక్ట్ అవుతారు.. జనసేన ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఇప్పటికే ఉంది అని నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!