NTV Telugu Site icon

Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. మైనంపల్లి హాట్ కామెంట్స్

Mynampalli

Mynampalli

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లు ఇవ్వాలో రేపో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అన్నారు. వాళ్ళని ఏమి అనవద్దు.. వాళ్ళు కూడా మనవాళ్లే అని వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ తనకు ఇష్టం అని తెలిపారు. రూ. 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కోనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని దుయ్యబట్టారు. కానీ గాంధీ ఒక్క రూపాయి తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరారని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.. కేటీఆర్ రేపటి నుంచి నీకు ఉంటుంది ఇక కాసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Read Also: JK Polls: రేపు జమ్మూకాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

కొండగట్టులో బస్సు ప్రమాదం, మాసాయిపేట ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని మైనంపల్లి ప్రశ్నించారు. ప్రభుత్వం పోగానే తెలంగాణ, ఆంధ్రా అంటూ చిచ్చు పెడుతున్నారు.. సెక్రటేరియట్‌ను కూల్చి బీఆర్ఎస్ వాళ్ళు నిధులు ఎత్తుకెళ్లారు అన్న ప్రచారం ఉంది.. ఈ రోజు మీరు కట్టిన సెక్రటేరియట్‌లో అన్ని లీకులు అవుతున్నాయి.. బీఆర్ఎస్ వాళ్ళవి క్రిమినల్ మైండ్‌లు అని ఆరోపించారు. విద్యుత్ అధికారులు కొందరు బీఆర్ఎస్ వాళ్ళకి సహకరిస్తున్నారు.. బీఆర్ఎస్ మీటింగ్‌లకి వాళ్లే కావాలని కరెంట్ కట్ చేస్తున్నారని మైనంపల్లి హనుమంతరావు అన్నారు.

Read Also: UP Crime: స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..