NTV Telugu Site icon

JC Prabhakar Reddy: మాకు ప్రాణాని ఉంది.. కేతిరెడ్డిని ఏపీ నుంచి బహిష్కరించాలి..!

Jc

Jc

JC Prabhakar Reddy: మాకు ప్రాణాని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాక్షన్‌ చేస్తా అని గతంలో మాట్లాడాడు.. మాకు ప్రాణాని ఉంది.. కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచే బహిష్కరించాలని కోరారు.. కేతిరెడ్డి జీవితం గన్‌మెన్‌ల తోనే సాగిందన్న ఆయన.. పోలింగ్ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేశారని తెలిపారు.. ఇక, గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లు ఏపీని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఆ అధికారులు ఇప్పుడు లా గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు..

Read Also: Children Begging: విదేశీయుల ఆటోను వెంబడించిన భిక్షాటన చేస్తున్న చిన్నారులు..

ఇక, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతా.. ఖచ్చితంగా కొడతామని హెచ్చరించారు జేసీ.. తాడిపత్రిలో నాకు శత్రువులు లేరన్న ఆయన.. వైసీపీలో నలుగురు, ఐదుగురు ఉన్నారు.. వాళ్లపై చట్టపరంగానే వెళ్తా.. తాడిపత్రిలో ఉండడానికి నాకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదన్నారు. నా నుంచి పోలీసులకు సమాచారం ఇస్తా… అప్పుడు రక్షణ కల్పించండి.. తాడిపత్రిలో అల్లర్ల కేసులో నన్ను అరెస్ట్ చేసుకోండి అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. తన ట్రావెల్స్ పై, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు.. ఈ నెల 24న అనంతపురం వన్ టౌన్ లో ఫిర్యాదు చేయబోతున్నాను అన్నారు.. పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, డీటీసీలపై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. పోలింగ్ రోజు అల్లర్లలో మేం ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేయలేదు.. న్యాయం జరిగే వరకు తాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కదలబోను అన్నారు. కొత్తగా వచ్చిన ఎస్పీ తమను ఇబ్బందులు పెట్టిన కేసులపై విచారణ జరపాలని కోరారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..