Kakarla Suresh: 50 వేల మెజార్టీతో గెలిపిస్తాం.. కాకర్లకు ముస్లిం మైనార్టీ మహిళల భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుపెన్నడు లేని విధంగా రికార్డులు తిరగరాస్తు 50 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు మహిళలు కాకర్ల సురేష్ కు భరోసా ఇచ్చారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ మహిళలు ముస్లిం సోదరులు సుమారు 500 మంది టిడిపి పార్టీలో ఉదయగిరి ఇంచార్జ్ కాకర్ల సురేష్ సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ.. 50వేల మెజార్టీ మెజారిటీతో ఉదయగిరి పై తెలుగుదేశం జెండా ఎగరవేస్తామన్నారు. వారికి ప్రధానంగా ఉన్న సమస్యలను కాకర్ల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా త్రాగునీరు రోడ్లు విద్యుత్ దీపాలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం కాకర్ల మాట్లాడుతూ.. నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటానని తెలిపారు. మనందరి భరోసా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటేనే సాధ్యమవుతుందన్నారు. 13వ తేదీ నుండి సీతారాంపురం చిన్న నాగంపల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయగిరి రియాజ్ ఆధ్వర్యంలో ఇంతమంది నాకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే మీ అందరిని కలుసుకుంటానని మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన నాడే కుటుంబాలు బాగుపడతాయని దానికోసం పాటు పడతానన్నారు. ఉదయగిరి నాయకులు పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ మన్నేటి వెంకటరెడ్డి బయన్నల ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలో త్వరలో పార్టీ కార్యాలయం అందరికీ అనువైన స్థలంలో ఏర్పాటు చేస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి జీవన ప్రమాణాలు మారుస్తానని కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమణులు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!