Ram Mandir: ఒంటిపై హిజాబ్, వీపుపై రాముడి ఫోటో.. అయోధ్యకు బయలు దేరిన ముస్లిం యువతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: భుజంపై కాషాయ జెండా, వీపుపై రామమందిరం ఫోటో, ఒంటిపై హిజాబ్ ధరించిన యువతి షబ్నమ్. రాముని భక్తిలో మునిగిపోయిన ఈ యువతి ముంబై నుండి అయోధ్యకు బయలుదేరింది. ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి దాదాపు 1,500 కి.మీ. దూరంలో ఉన్న అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం బయలు దేరారు. ముంబై నుంచి నడుచుకుంటూ వస్తున్న ఈ షబ్నం షేక్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికి షబ్నం రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి నాసిక్ చేరుకుంది. సమయం ఇస్తే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుస్తానని షబ్నం తెలిపారు.
Read Also:Madhya Pradesh: మైనర్ బాలికపై అత్యాచారం.. అవమానం భరించలేకు పురుగుల మందు తాగి..
Also Read
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
షబ్నమ్ రాంలాలాను చూడాలనుకుంటోంది. ఆమె తనను తాను సనాతన ముస్లిం అని చెప్పుకుంటుంది. ఆమెకు భద్రత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మహిళా పోలీసులను ఏర్పాటు చేసింది. షబ్నమ్కి చిన్నప్పటి నుంచి రామాయణం అంటే అమితమైన ఇష్టం. ఆమె మహాభారతం సీరియల్ పూర్తిగా చూసింది. రామాయణం, మహాభారతాలు ఆమె జీవితాన్ని చాలా బాగా ప్రభావితం చేశాయి. ఆమె రాముడిని తన రోల్ మోడల్గా భావిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా తనను అయోధ్యకు వెళ్లమని ప్రోత్సహించారు. అయోధ్యలో శ్రీరాముడి దర్శనం అనంతరం ఆమె అయోధ్యలోని ధనిపూర్లో నిర్మాణంలో ఉన్న మసీదుకు వెళ్లనున్నారు. దీని ద్వారా తనకు రెండు మతాల పట్ల ఆసక్తి ఉందనే సందేశాన్ని అందించబోతోంది.
Read Also:Chennai: “ట్రాన్స్జెండర్ లవ్ స్టోరీ”.. ప్రేమను ఒప్పుకోలేదని నందిని దారుణ హత్య..
జనవరి 22న అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ వేడుక సందర్భంగా షబ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాలినడకన ముంబై నుంచి బయలుదేరింది. ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు రామన్రాజ్ శర్మ, బినిత్ పాండే ఉన్నారు. తనకు రామాయణం, శ్రీరాముడిపై చాలా ఆసక్తి ఉందని ఆమె స్పందించారు. అదేవిధంగా అయోధ్యకు వెళ్లి శ్రీరామచంద్రుడి గురించి మరింత తెలుసుకోవాలనేది తన ఆశయమని షబ్నమ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కృషితో తాను స్ఫూర్తి పొందానని షబ్నమ్ అన్నారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!