హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. నగర జీవనాడి అయిన మూసీ, ఈసా నదుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని.. అయితే ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. నదుల ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ అత్యంత కీలకం. ఈ పరిధిలో…