Murder Attempt : ములుగు జిల్లాలో ఎంపిడీవోపై హత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపిడివో రామకృష్ణయ్య కిడ్నాప్ హత్య ఘటన మరిచిపోక ముందే ములుగు జిల్లాలో ఎంపిడివో పై దాడి హత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. వెంకటాపూర్ ఎంపీడీవో శ్రీనివాస్ పై దాడికి ఆరుగురు కారులో వెంబడించారు. తృటిలో తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ ఎంపీడీవో సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పోడు భూముల పట్టాల గురించి మాట్లాడేందుకు మల్లయ్యపల్లి, అడవి రంగాపూర్, రామకృష్ణాపూర్ గ్రామాలకు వెళ్లారు. అక్కడి సర్పంచ్ లు, గ్రామకార్యదర్శులతో చర్చించి తిరిగి వస్తుండగా బూర్గుపేటకు చెందిన భీంరావు, దుగ్యాల రాజు మరో నలుగురు కారులో వెంబడించారు. స్క్రూటి పై వెళ్తున్న ఎంపీడీవోను అడవి రంగాపూర్ దగ్గర ఆపి అడవి రంగాపూర్ సర్పంచ్, కార్యదర్శులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బూతులు తిట్టారు. ఎంపీడీవో తప్పించుకుని పోగా లక్ష్మీదేవి పేట వద్ద కారు అడ్డుగా పెట్టారు. అక్కడి నుంచి కూడా తప్పించుకుపోగా వదలకుండా నల్లగుంట, రామకృష్ణాపూర్ వరకు వచ్చి కారుతో డ్యాష్ ఇవ్వడానికి ప్రయత్నించారు. సినిమా థ్రిల్లర్ ను తలపించేలా వెంబడించిన వారు దాడికి యత్నించడమే కాకుండా సెల్ ఫోన్ లో వీడియో సైతం తీసుకున్నారు.’ అని తెలిపారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ప్రాణభయంతో తప్పించుకుని వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకుడు గుంతల కాంట్రాక్టు తీసుకున్న రాజు, భీంరావు పనులు చేయకుండానే ఎంబి రికార్డు చేసి బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేశారని అందుకు నిరాకరించడంతో దూషించి దాడి చేసి చంపేందుకు యత్నించారని శ్రీనివాస్ తెలిపారు.
స్క్రూటిపై విధులకు హాజరై వెళ్తున్న ఎంపిడిఓ పై దాడికి యత్నించిన రాజు, భీంరావు తోపాటు ఆరుగురుపై ఐపీసీ 353, 341, 506, 290 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని మిగతా వారికోసం ఆరా తీస్తున్నారు. దాడికి యత్నించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని ఎస్ఐ స్పష్టం చేశారు.
పదిరోజుల క్రితం జనగామ జిల్లా పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపిడిఓ రామకృష్ణయ్య కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన మరిచిపోకముందే ములుగులో మరో ఎంపిడివో పై దాడికి యత్నించడం ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?