Smriti Mandhana: రికార్డు బ్రేక్.. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా స్మృతి
- ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన
- 4 సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డ్
- భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా..
Smriti Mandhana: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మంధాన మరోమారు సెంచరీతో సత్తా చాటింది. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్స్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదురుకొని భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అన్నాబెల్ సదర్లాండ్ సెంచరీ కారణంగా ఆరు వికెట్లకు 298 పరుగులు చేసింది. మరోవైపు, అరుంధతి రెడ్డి భారత్ తరఫున అద్భుతంగా రాణించి 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మొదట్లో 78 పరుగులకే తొలి 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సదర్లాండ్ 95 బంతుల్లో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించింది.
Also Read: AUS W vs IND W: స్మృతి మందాన సెంచరీ చేసినా.. భారీ తేడాతో ఓడిన భారత్
Also Read
- Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
- Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
- Sugar-Free Lassi Recipe: మండే ఎండ నుంచి తక్షణ ఉపశమనం.. షుగర్ లేకుండా క్షణాల్లో టేస్టీ లస్సీ..
ఇక భారీ లక్ష్య ఛేదనలో ప్రతిగా స్మృతి మంధాన జట్టుకు శుభారంభం అందించి ఏడాదిలో నాలుగో సెంచరీ సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో స్మృతి మంధాన 103 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. ఈ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. అయితే, సెంచరీ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక 105 పరుగులు చేసి ఔటైంది. ఇకపోతే, 2024లో ఆమెకు నాలుగో వన్డే సెంచరీ. దీంతో మహిళా క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రీడాకారిణిగా కూడా స్మృతి మంధాన నిలిచింది. మహిళల వన్డే క్రికెట్లో 7 మంది క్రీడాకారిణులు ఏడాది వ్యవధిలో అత్యధికంగా 3 సెంచరీలు మాత్రమే సాధించారు. కానీ, స్మృతి మంధాన 4 సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించింది.
ఈ ఇన్నింగ్స్తో స్మృతి మంధాన తన వన్డే కెరీర్లో 9 సెంచరీలు పూర్తి చేసుకుంది. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా స్మృతినే. మరోవైపు, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. స్మృతి మంధానతో పాటు నాట్ స్కివర్ బ్రంట్, షార్లెట్ ఎడ్వర్డ్స్, చమరి అటపట్టు కూడా వన్డే క్రికెట్లో 9 సెంచరీలు చేశారు. అదే సమయంలో, మెగ్ లానింగ్ 15 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్ 13 సెంచరీలతో, ఇంగ్లాండ్ కు చెందిన టామీ బ్యూమాంట్ 10 సెంచరీలతో.. వరుసగా రెండు మూడు స్థానాలలో ఉన్నారు.
తాజావార్తలు
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
-
Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
-
Vastu Tips: మీ డైనింగ్ టేబుల్పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!