Smriti Mandhana: రికార్డు బ్రేక్.. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా స్మృతి
- ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన
- 4 సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డ్
- భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మంధాన మరోమారు సెంచరీతో సత్తా చాటింది. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్స్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదురుకొని భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అన్నాబెల్ సదర్లాండ్ సెంచరీ కారణంగా ఆరు వికెట్లకు 298 పరుగులు చేసింది. మరోవైపు, అరుంధతి రెడ్డి భారత్ తరఫున అద్భుతంగా రాణించి 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మొదట్లో 78 పరుగులకే తొలి 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సదర్లాండ్ 95 బంతుల్లో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించింది.
Also Read: AUS W vs IND W: స్మృతి మందాన సెంచరీ చేసినా.. భారీ తేడాతో ఓడిన భారత్
Also Read
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
ఇక భారీ లక్ష్య ఛేదనలో ప్రతిగా స్మృతి మంధాన జట్టుకు శుభారంభం అందించి ఏడాదిలో నాలుగో సెంచరీ సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో స్మృతి మంధాన 103 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. ఈ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. అయితే, సెంచరీ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక 105 పరుగులు చేసి ఔటైంది. ఇకపోతే, 2024లో ఆమెకు నాలుగో వన్డే సెంచరీ. దీంతో మహిళా క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రీడాకారిణిగా కూడా స్మృతి మంధాన నిలిచింది. మహిళల వన్డే క్రికెట్లో 7 మంది క్రీడాకారిణులు ఏడాది వ్యవధిలో అత్యధికంగా 3 సెంచరీలు మాత్రమే సాధించారు. కానీ, స్మృతి మంధాన 4 సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించింది.
ఈ ఇన్నింగ్స్తో స్మృతి మంధాన తన వన్డే కెరీర్లో 9 సెంచరీలు పూర్తి చేసుకుంది. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా స్మృతినే. మరోవైపు, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. స్మృతి మంధానతో పాటు నాట్ స్కివర్ బ్రంట్, షార్లెట్ ఎడ్వర్డ్స్, చమరి అటపట్టు కూడా వన్డే క్రికెట్లో 9 సెంచరీలు చేశారు. అదే సమయంలో, మెగ్ లానింగ్ 15 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్ 13 సెంచరీలతో, ఇంగ్లాండ్ కు చెందిన టామీ బ్యూమాంట్ 10 సెంచరీలతో.. వరుసగా రెండు మూడు స్థానాలలో ఉన్నారు.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్కు పూనకాలే
-
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!