Mumbai Rains: ముంబైలో భారీ వర్షం.. నిలిచిపోయిన విమాన, రైళ్ల సర్వీసులు
- ముంబైలో భారీ వర్షం
- ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
- నీట మునిగిన రహదారులు.. లోతట్టు ప్రాంతాలు
- 27 విమానాల దారి మళ్లింపు
- పాఠశాలలు
- కళాశాలలకు హాఫ్ డే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం తెల్లవారుజామున ముంబై.. శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలపై భారీగా నీరు నిలిచింది. భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు.. భారీ వర్షం దృష్ట్యా కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా, ముంబై విమానాశ్రయంలో 27 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. నగరంలో తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు శాఖ అధికారులు తెలిపారు. అంధేరి, కుర్లా, భాండూప్, కింగ్స్ సర్కిల్, విలే పార్లే మరియు దాదర్తో సహా అనేక ప్రాంతాలలో నీరు భారీగా చేరింది.
ఇదిలా ఉంటే.. భారీ వర్షం కారణంగా ముంబైలో పాఠశాలలు మూసివేయశారు. BMC పౌర సంస్థ పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది. తరగతుల మధ్యాహ్నం సెషన్పై నిర్ణయం తర్వాత ప్రకటిస్తారు. భారీ వర్షం కారణంగా ముంబై విమానాశ్రయంలో రన్వే కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. సోమవారం తెల్లవారుజామున 2.22 నుండి 3.40 వరకు 27 విమానాలను దారి మళ్లించారు. అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్ వంటి ఇతర నగరాలకు విమానాలను మళ్లించామని, ప్రస్తుతం విమానాల రాకకు ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారి తెలిపారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
Read Also: MLC Kavitha: కవిత పిటిషన్ పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
ముంబై విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయానికి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. “వాతావరణం అనుకూలంగా లేకపోవడం, భారీ నుండి అతి భారీ వర్షాల సూచనల దృష్ట్యా.. ముంబై విమానాశ్రయం ప్రయాణికులందరూ తమ తమ విమానయాన సంస్థలతో తమ విమాన స్థితిని తనిఖీ చేసి, కొంచెం ముందుగా విమానాశ్రయానికి బయలుదేరాలని తెలిపారు. అటు.. రైళ్లు కూడా రద్దు చేశారు. సెంట్రల్ రైల్వే MMR-CSMT (12110), పూణే-CSMT (11010), పూణే-CSMT డెక్కన్ (12124), పూణే-CSMT డెక్కన్ (11007) మరియు CSMT-పూణే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (12127) రైళ్లను రద్దు చేశారు. ట్రాక్ల నుండి నీరు తగ్గిన తర్వాత లోకల్ రైలు సర్వీసులను పునఃప్రారంభించారు.
భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు నీటమునిగాయి. దీంతో.. సోమవారం ఉదయం విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు.. పౌర సంస్థ ముంబై వాసులకు హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటల్లో నగరంలో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం ముంబైలో మేఘావృతమై ఉంది. ఈ క్రమంలో.. నగరవాసులు సురక్షితంగా ఉండాలని.. అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని BMC సూచించింది.
తాజావార్తలు
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!