Father Kills Son: మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు.. కన్న కొడుకునే కడతేర్చాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Kills Son: ప్రస్తుత కాలంలో కొందరు వివాహితులు తాత్కాలిక శారీరక సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారితో పాటు కన్నవారిని కడతేర్చడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసి.. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని వాగులో పడేశాడు. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అతను నేరం చేసిన కొన్ని గంటల అనంతరం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకు జరిపిన విచారణలో.. 22 ఏళ్ల నిందితుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళను వివాహం చేసుకునేందుకే తన కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు కనుక్కున్నారు. ఎందుకంటే తనను పెళ్లి చేసుకోవాలంటే కుమారుడి అడ్డు తొలగించాలని ఆ మహిళ షరతు పెట్టినట్లు విచారణలో తేలింది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే భార్య, కొడుకును అడ్డు లేకుండా చేయాలని ఆ మహిళ నిందితుడికి చెప్పినట్లు ఓ అధికారి చెప్పారు. ఆ రెండేళ్ల బాలుడి మృతదేహాన్ని కేమ్కార్ చౌక్ సమీపంలోని మహిమ్ వాగులో కనుగొన్నట్లు షాహు నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ సంచిలో ఉన్న మృతదేహాన్ని ఎలుకలు కొరికినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లాడు కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి బంధువులతో జరిపిన విచారణలో.. అతని తండ్రి ధారవి మురికివాడలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
Also Read
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
Read Also: Vijayawada Crime: ప్రేమికులకు నచ్చజెప్పేందుకు వచ్చాడు.. దారుణ హత్యకు గురయ్యాడు..!
“గార్మెంట్ ఫ్యాక్టరీలో టైలర్గా పనిచేస్తున్న నిందితుడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.. తనను పెళ్లి చేసుకోవాలంటే తన భార్య, కొడుకును అంతమొందించాలని ఆమె అతడిని కోరిందని, ఆ తర్వాత వారిని చంపేందుకు నిందితులు పథకం పన్నారు. ” అని పోలీసు అధికారి తెలిపారు. చాక్లెట్ ఇస్తానని చెప్పి భార్య దగ్గర నుంచి కొడుకును తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు నిందితుడు. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని మహిమ్ వాగులో పడేశాడు. నిందితుడిని ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 362 (అపహరణ), సంబంధిత ఇతర సెక్షన్ల ప్రకారం అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!