Mudragada Vs Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ముద్రగడ సవాల్.. నిన్ను ఓడించలేకపోతే నా పేరు మార్చుకుంటా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Vs Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్కు బహిరంగ సవాల్ విసిరారు.. పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే.. నా పేరు మార్చుకుంటా.. పవన్ను ఓడించలేకపోతేనే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు.. ఇక, రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదన్న ఆయన.. పవన్ బూతులు మాట్లాడుతున్నాడు.. విషయం మీద అవగాహన లేక తెలుసుకోవడానికి ఖాళీ లేక మాట్లాడుతున్నాడు.. తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రూ వైసీపీలోనే ఉన్నాడు తెలుసుకో అని సూచించారు. తుని రైలు ఘటనకి చంద్రబాబు కారణం.. ఆ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. నన్ను తీహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేశాడు అని ఆరోపించారు.
నేను చవటను దద్దమ్మను.. కాపులు కోసం నువ్వు ఎందుకు రోడ్డు ఎక్కలేదు? అని నిలదీశారు ముద్రగడ.. పవన్ నా పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు.. అసలు వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి ఉన్న హక్కు ఏంటి? అని నిలదీశారు. ఉద్యమానికి ఎప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వలేదన్న ఆయన.. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడు? అసలు పవన్ అడ్రెస్ ఏంటి? ఎక్కడ పుట్టాడు..? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీరు పెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా? అని ఎద్దేవా చేశారు. ఇక, పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానన్న ఆయన.. సినిమాలలో నటించండి.. రాజకీయాల్లో కాదు అని సూచించారు. నీ పార్టీ త్వరలో ఫ్యాకప్ అవుతుంది.. పిఠాపురంలో నిన్ను తన్ని తరిమేస్తారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read
సినిమా వాళ్లుఎ ఎప్పుడైనా ప్రజలను అక్కున చేర్చుకున్నారు? అని ప్రశ్నించారు ముద్రగడ.. ఉప్మా, కాపీ అని నన్ను పవన్ అవమానిస్తున్నాడు.. గౌరవం చేయడం మా అలవాటు.. సిగ్గు లేదా అలా అనడానికి? అని ఫైర్ అయ్యారు. నీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరికి అయినా కనీసం కాపీ ఇచ్చారా? అని నిలదీశారు. 1978లో చంద్రబాబుకి ఇంటి పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేదు.. రెండు ఎకరాలు నుంచి అపర కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? అని ప్రశ్నించారు. ఇక, చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదన్న ఆయన.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వస్తే గౌరవిస్తారు.. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం గురించి చిరంజీవి ఎందుకు బయటకు రాలేదు..? అని నిలదీశారు. అయితే, ఇప్పుడు మద్దతుగా వీడియోలు రిలీజ్ ఇస్తే ప్రజలు నమ్ముతారా? అని నిలదీశారు ముద్రగడ పద్మనాభం.
తాజావార్తలు
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
-
December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్గా డిసెంబర్
-
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!