MS Dhoni: ఏంటి..! ధోనీని బలవంతంగా కెప్టెన్సీ నుంచి తొలగించారా..? బయట పడిన సంచలన నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియాలో కెప్టెన్ల తొలగింపు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. వారి ఫిట్నెస్, తదితర సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్స్ను బాధ్యతల నుంచి పక్కన పెడుతుంటారు. 2025లో భారత క్రికెట్లో రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ మార్పు అనంతరం పెద్ద దుమారమే రేగింది. 2017లోనూ ఎంఎస్ ధోనీని కెప్టెన్ నుంచి తొలగతించి విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించినప్పుడు పెద్ద చర్చ జరిగింది. అయితే ఆ మార్పు ఎలా జరిగిందన్న విషయంపై తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎస్ ధోనీ (MS Dhoni) 2014లోనే టెస్ట్ కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకున్నాడు. కానీ 2017లో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా బాధ్యతలు విరాట్ కోహ్లీకి (Virat Kohli)కి అప్పగించారు. ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకోలేదు. భారత క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ (Board of Control for Cricket in India) సెలక్షన్ కమిటీ ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముందే ఆలోచించిందట.
READ MORE: Jailer2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read
- Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్కు నివాళి
- Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రం సూపర్.. ఆ ఒక్క లోపం సరిదిద్దుకుంటే ఇంగ్లండ్కు చుక్కలే..!
- FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
అప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్న జతిన్ పరంజపే తాజాగా చెప్పిన వివరాల ప్రకారం.. తాను, అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ (MSK Prasad) కలిసి ధోనీతో మాట్లాడాలని నిర్ణయించారు. ధోనీ నెట్లో బ్యాటింగ్ చేస్తుండగా అక్కడికి వెళ్లారు. ధోనీతో మాట్లాడాలని కొంత సమయం వేయిట్ చేశారు. ఎలా మాట్లాడాలి? ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? అని ముందే ప్లానింగ్ చేశారట. చివరికి ధోనీ దగ్గరకు వెళ్లి, “ఇప్పుడు మార్పు చేయడానికి సరైన సమయం వచ్చిందని అనుకుంటున్నాం” అని కెప్టెన్సీ గురించి వివరించారు. అందుకు ధోనీ ఎలాంటి అసహనం చూపలేదట. వెంటనే, “ఇది సరైన నిర్ణయం. నేను ఇప్పుడు ఏమి చేయాలి చెప్పండి” అని సమాధానం ఇచ్చాడట. కమిటీ తరఫున లిఖితపూర్వకంగా తప్పుకుంటున్నట్టు మెయిల్ పంపాలని చెప్పగా, ధోనీ అంగీకరించాడు. అదే రాత్రి “నేను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను” అని మెయిల్ పంపాడట. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయని జతిన్ పరాంజపే తెలిపారు. కానీ టీమ్ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమని భావించామని చెప్పారు. అంతేకాదు, కోహ్లీకి పూర్తి మద్దతు ఇస్తానని ధోనీ హామీ ఇచ్చాడట. “విరాట్ నా తమ్ముడు లాంటి వాడు. నాకు ఉన్న అనుభవం అంతా అతనికి ఇస్తాను. మనం మంచి జట్టును నిర్మిద్దాం” అని ధోనీ చెప్పినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
-
Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
-
Ethnic Unity Law: ముస్లింలే టార్గెట్.. కమ్యూనిస్టు దేశంలో మైనార్టిలపై అణచివేత చట్టాలు!
-
YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్కు నివాళి
-
Aakasamlo Oka Tara: సెట్స్ నుంచి దుల్కర్ సల్మాన్ షేర్ చేసిన BTS ఫొటో వైరల్.. పెరిగిన అంచనాలు
ట్రెండింగ్
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!