YS Avinash Reddy: వివేకా చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. సంచలన వీడియో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Avinash Reddy: వివేకా చనిపోయిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆరోజు ఎం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. ఆ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలను అవినాష్ రెడ్డి చెప్పారు. సెల్ఫీ వీడియోలో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. “శివప్రకాష్ రెడ్డి ((వివేకా బామ్మర్ది ) నాకు ఉదయం 6:30కి ఫోన్ చేశారు. నేను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నా. జీకే కొండారెడ్డి పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి వెళ్తున్నా. సరిగ్గా పులివెందుల రింగ్రోడ్డులో ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. వివేకా నో మోర్ అని నాకు ఫోన్లో చెప్పారు. దీంతో వెంటనే నేను వివేకా ఇంటికి వెళ్లాను. వివేకా రాసిన లెటర్, ఫోన్ గురించి పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డికి చెప్పారు. అయితే ఆ లెటర్, ఫోన్ను దాచమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టొద్దని లేఖలో వివేకా రాశారు. ఈ మొత్తం మర్డర్ కేసులో ఆ లెటరే చాలా కీలకం. ప్రసాద్ను ఏమైనా అంటారేమో అని లేఖ దాచామని సునీత చెప్పారు. మీ నాన్నను కాకుండా డ్రైవర్ ప్రసాద్నే నమ్ముతారా? లెటర్ విషయాన్ని నాకు , పోలీసులకు చెప్పలేదు. ఆ లెటర్ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? మర్డర్ అని తెలిసిన తర్వాత కూడా లెటర్ ఎందుకు దాచారు? మీ వైపు తప్పు ఉంది కాబట్టే ఆ లెటర్ను దాచారు. ఇదే విషయం నేను సీబీఐకి చెప్పాను.” అని అవినాష్ రెడ్డి తెలిపారు.
Read Also: YS Viveka Case: వైఎస్ వివేకా కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
Also Read
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
- Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
ఆ లెటర్లో వివేకానందరెడ్డి.. ‘నా డ్రైవర్ నేను డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాసేందుకు నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు’ అని పేర్కొన్నారు. ఇది వివేకానందరెడ్డి రాసిన చివరి మాటలు, వివేకానందరెడ్డిది హత్య అని చెప్పడానికి లెటర్ అనేది చాలా కీలక ఆధారమని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారని అడిగితే.. “ప్రసాద్ చాలా మంచోడు అని, ఆయనను ఎవరైనా ఎమైనా అంటారని దాచిపెట్టమన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి, సునీత చెబుతారు. సునీతా వాళ్ల నాన్నను నమ్మదా?. వాళ్ల నాన్న చివరి సారిగా రాసిన లేఖ, మాటలను నమ్మరా?. ప్రసాద్నే ఎక్కువ నమ్ముతారా?. ఇది వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. సీబీఐ స్టేట్మెంట్లో సునీతా ఒక్కో స్టేట్మెంట్ ఒక్కో మాదిరిగా చెబుతుంది. ఒక్క స్టేట్మెంట్ చాలా వివరంగా చెబుతుంది. తర్వాత స్టేట్మెంట్లో తప్పులను కవర్ చేస్తుంది. తాను అలా అనలేదని, మర్చిపోయానని చెబుతుంది. ” అని అవినాష్ చెప్పుకొచ్చారు.
“సీబీఐ వాళ్లకు చాలా స్వేచ్చ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి, సునీత చేసిన మిస్టేక్స్ను కవర్ చేసుకునే స్వేచ్చ ఇస్తుంది. ఈ విధంగా లెటర్ ఉందని సమయానికి పోలీసులకు గానీ, తనకు గానీ చెప్పకపోవడం.. ఈ కేసులో అతిపెద్ద తప్పు. అటువంటి ఆధారాన్ని దాచిపెడితే సీబీఐ విచారణలో రామ్ సింగ్ అనే దానిని డౌన్ ప్లే చేశారు. ఈ అంశం నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. సీబీఐ మొత్తాన్ని నేను బ్లేమ్ చేయడం లేదు. రామ్ సింగ్ వైఖరి మాత్రం తేడాగా ఉంది. లెటర్ను డౌన్ ప్లే చేయడం ఎవరిని కాపాడేందుకు?. శివప్రకాశ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సునీతను కాపాడేందుకు రామ్ సింగ్ ఇదంతా చేశారు. వాళ్లు చేసేది తప్పు. లెటర్ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం అతిపెద్ద తప్పు. ” అని సెల్ఫీ వీడియోలో అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది. వచ్చే నెల 5లోగో హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఎర్ర గంగరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచించింది. గతంలో అరెస్ట్ అయిన గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్పై వైఎస్ సునీతారెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఇరుపక్షాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గంగిరెడ్డి బెయిల్పై సీబీఐకి హైకోర్టులో ఊరట లభించినట్లయింది.
తాజావార్తలు
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!