సంగారెడ్డిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, BJYM జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి కేటీఆర్ తో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడేమో..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మొదటినుంచి తోడు దొంగల పార్టీ..నాణానికి బొమ్మ బొరుసు ఈ పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, మెడిగడ్డ, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్ మీట్లతో సరిపెడుతున్నారు తప్ప యాక్షన్ లేదు అని, తప్పు చేసినోడు కొడుకైన, కూతురైన శిక్షించడానికి వెనుకాడనని కేసీఆర్ అన్నాడు కానీ ఆయన మనసు ఒప్పలేదన్నారు ఎంపీ రఘునందన్ రావు.
ఈనాడు రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు తప్ప చేతలు లేవు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు అత్త కొట్టింది కోడలు ఏడ్చింది అన్నట్టు ఉందన్నారు. ఆగస్ట్ 2న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి సుంకిషాల కూలిపోయింది అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ కి దమ్ములేదని చెప్పారని, పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష బాధ్యత BRS ఎందుకు తీసుకోలేదు కేటీఆర్ అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో 1000 కోట్లకు నోటీసులిచ్చిన HMDA అధికారి అరవింద్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Trai New Rule: ఇకపై అలాచేస్తే మీ సిమ్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్లో..