MP Margani Bharat: చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్కి నోట్ల కట్టలు కావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు.. తప్పిస్తే ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు.. రాజమండ్రిలో. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తన సొంత కొడుకు సమర్ధతపై నమ్మకం లేకనే సినీ గ్లామర్ తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన దొందుకు దొందేనని ఎప్పటినుంచో చెబుతూ వచ్చామన్నారు. అసలు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిందే టీడీపీ కోసమని.. ప్రజల కోసం, అభిమానుల కోసం కాదన్నారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి, పవన్ కల్యాణ్కు నోట్ల కట్టలు కావాలంటూ ఆరోపణలు గుప్పించారు.
జనసేన పార్టీ పెట్టిన గత పదీ పదిహేను సంవత్సరాల నుంచి ముసుగేసుకుని రాజకీయాలు చేసిన పవన్ కల్యాణ్ చివరకు చంద్రబాబు భారీ అవినీతి స్కామ్ లో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటంతో.. పవన్ ‘రథసారథి’ పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు భరత్ రామ్. ఇప్పుడు తన ముసుగును పవన్ తొలగించి ‘పొత్తు’ పేరుతో మరో రాజకీయ కుప్పిగంతులకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఇక, టీడీపీ, జనసేన రాజమండ్రిలో భేటీ అయినంత మాత్రాన ఫలితమేమీ ఉండదన్నారు. చంద్రబాబు గత 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటేనే ప్రజల నుంచి ఎటువంటి స్పందనా, సానుభూతి కనిపించలేదని విమర్శించారు. మొన్న కంబాల చెరువు పార్కు ప్రారంభోత్సవానికి వేలాదిగా జనం వచ్చారు.. అలాగే దేవీ నవరాత్రులకు అత్యంత భక్తిప్రపత్తులతో జనం తరలి వస్తున్నారు.. మరి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు అరెస్టు అయితే ఎందుకు స్పందించడం లేదో గ్రహించాలన్నారు.
Also Read
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
చంద్రబాబు నక్క జిత్తుల రాజకీయాలను అర్ధం చేసుకున్నారు కాబట్టే ప్రజల్లో స్పందన, సానుభూతి కనిపించడం లేదన్నారు ఎంపీ భరత్. అలాగే జనసేన పవన్ కల్యాణ్కు రాజకీయ కార్యాచరణ లేదని, కౌలు రైతులు ఓ పదీ పదిహేను మందికి డబ్బులిచ్చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారని, వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం మద్దతిస్తున్నారని తెలిపారు. ఓటు చాలా విలువైనదని, వృథా చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రజలు మరోసారి వైఎస్ జగన్ని సీఎంను చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..