MP Margani Bharat: చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్కి నోట్ల కట్టలు కావాలి..!
MP Margani Bharat: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు.. తప్పిస్తే ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు.. రాజమండ్రిలో. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తన సొంత కొడుకు సమర్ధతపై నమ్మకం లేకనే సినీ గ్లామర్ తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన దొందుకు దొందేనని ఎప్పటినుంచో చెబుతూ వచ్చామన్నారు. అసలు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిందే టీడీపీ కోసమని.. ప్రజల కోసం, అభిమానుల కోసం కాదన్నారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి, పవన్ కల్యాణ్కు నోట్ల కట్టలు కావాలంటూ ఆరోపణలు గుప్పించారు.
జనసేన పార్టీ పెట్టిన గత పదీ పదిహేను సంవత్సరాల నుంచి ముసుగేసుకుని రాజకీయాలు చేసిన పవన్ కల్యాణ్ చివరకు చంద్రబాబు భారీ అవినీతి స్కామ్ లో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటంతో.. పవన్ ‘రథసారథి’ పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు భరత్ రామ్. ఇప్పుడు తన ముసుగును పవన్ తొలగించి ‘పొత్తు’ పేరుతో మరో రాజకీయ కుప్పిగంతులకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఇక, టీడీపీ, జనసేన రాజమండ్రిలో భేటీ అయినంత మాత్రాన ఫలితమేమీ ఉండదన్నారు. చంద్రబాబు గత 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటేనే ప్రజల నుంచి ఎటువంటి స్పందనా, సానుభూతి కనిపించలేదని విమర్శించారు. మొన్న కంబాల చెరువు పార్కు ప్రారంభోత్సవానికి వేలాదిగా జనం వచ్చారు.. అలాగే దేవీ నవరాత్రులకు అత్యంత భక్తిప్రపత్తులతో జనం తరలి వస్తున్నారు.. మరి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు అరెస్టు అయితే ఎందుకు స్పందించడం లేదో గ్రహించాలన్నారు.
Also Read
చంద్రబాబు నక్క జిత్తుల రాజకీయాలను అర్ధం చేసుకున్నారు కాబట్టే ప్రజల్లో స్పందన, సానుభూతి కనిపించడం లేదన్నారు ఎంపీ భరత్. అలాగే జనసేన పవన్ కల్యాణ్కు రాజకీయ కార్యాచరణ లేదని, కౌలు రైతులు ఓ పదీ పదిహేను మందికి డబ్బులిచ్చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారని, వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం మద్దతిస్తున్నారని తెలిపారు. ఓటు చాలా విలువైనదని, వృథా చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రజలు మరోసారి వైఎస్ జగన్ని సీఎంను చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!