MP Margani Bharat: చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్కి నోట్ల కట్టలు కావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు.. తప్పిస్తే ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు.. రాజమండ్రిలో. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తన సొంత కొడుకు సమర్ధతపై నమ్మకం లేకనే సినీ గ్లామర్ తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన దొందుకు దొందేనని ఎప్పటినుంచో చెబుతూ వచ్చామన్నారు. అసలు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిందే టీడీపీ కోసమని.. ప్రజల కోసం, అభిమానుల కోసం కాదన్నారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి, పవన్ కల్యాణ్కు నోట్ల కట్టలు కావాలంటూ ఆరోపణలు గుప్పించారు.
జనసేన పార్టీ పెట్టిన గత పదీ పదిహేను సంవత్సరాల నుంచి ముసుగేసుకుని రాజకీయాలు చేసిన పవన్ కల్యాణ్ చివరకు చంద్రబాబు భారీ అవినీతి స్కామ్ లో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటంతో.. పవన్ ‘రథసారథి’ పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు భరత్ రామ్. ఇప్పుడు తన ముసుగును పవన్ తొలగించి ‘పొత్తు’ పేరుతో మరో రాజకీయ కుప్పిగంతులకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఇక, టీడీపీ, జనసేన రాజమండ్రిలో భేటీ అయినంత మాత్రాన ఫలితమేమీ ఉండదన్నారు. చంద్రబాబు గత 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటేనే ప్రజల నుంచి ఎటువంటి స్పందనా, సానుభూతి కనిపించలేదని విమర్శించారు. మొన్న కంబాల చెరువు పార్కు ప్రారంభోత్సవానికి వేలాదిగా జనం వచ్చారు.. అలాగే దేవీ నవరాత్రులకు అత్యంత భక్తిప్రపత్తులతో జనం తరలి వస్తున్నారు.. మరి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు అరెస్టు అయితే ఎందుకు స్పందించడం లేదో గ్రహించాలన్నారు.
Also Read
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
చంద్రబాబు నక్క జిత్తుల రాజకీయాలను అర్ధం చేసుకున్నారు కాబట్టే ప్రజల్లో స్పందన, సానుభూతి కనిపించడం లేదన్నారు ఎంపీ భరత్. అలాగే జనసేన పవన్ కల్యాణ్కు రాజకీయ కార్యాచరణ లేదని, కౌలు రైతులు ఓ పదీ పదిహేను మందికి డబ్బులిచ్చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారని, వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం మద్దతిస్తున్నారని తెలిపారు. ఓటు చాలా విలువైనదని, వృథా చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రజలు మరోసారి వైఎస్ జగన్ని సీఎంను చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!