TDP : బెజవాడలో మళ్లీ హీటెక్కుతున్న టీడీపీ పాలిటిక్స్
బెజవాడలో టీడీపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పర్యటన సందర్భంగా కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా దేవినేని ఉమపై కేశినేని నాని సెటైర్లు వేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఎంపీ కేశినేని నాని, జలీల్ ఖాన్ పాల్గొన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి బుద్దా వెంకన్న, నాగుల్ మీరా దూరంగా ఉన్నారు. అయితే.. టీడీపీ ఎంపీ కేశినేని మాట్లాడుతూ.. అందరినీ భాగస్వామ్యం చేసి టీం టీడీపీ పేరుతో కార్యక్రమాలు చేస్తామన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. కమర్షియల్ నేతలను అంగీకరించే ప్రసక్తే లేదని, ఎక్కడో తొడలు కొట్టినంత మాత్రాన నేతలు కాలేరన్నారు. మీడియా నుంచి కాదు.. ప్రజల్లో నుంచే నాయకులు బయటకి వస్తారని, చంద్రబాబు సీఎం కావాలనే సంకల్పంతో కలిసి మెలిసి పని చేయాలన్నారు. నాకు నేనే గొప్ప అని వెళితే ప్రజల్లో పరాభవం తప్పదని, అందరూ ఎవరి స్థాయిలో వారు పని పంచుకుని ముందుకు సాగాలని ఆయన హితవు పలికారు. గతేడాది నుంచి ఇక్కడ ప్రజాస్వామ్యబద్దంగా టీడీపీ పని చేస్తుందని, ఎవరు పదవులు పొందినా ఐక్యంగా నిర్ణయం జరిగిందన్నారు. జగన్ పాలనలో ప్రజలు పాట్లు పడుతున్నారని, యధా రాజా తధా ప్రజ అన్నట్లుగా వైసీపీ నేతలు ఉన్నారన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
వారు ఎన్ని మాయలు చేసినా ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జగన్ మాయ మాటలను, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల,మతాలకతీతం. పార్టీ నే కాదు… వ్యక్తిని చూసి ఓటేస్తారు. 2019ఎన్నికల్లో ఎంపిగా నాకు మెజారిటీ ఇచ్చారు.. ఎమ్మెల్యేని ఓడించారు. తానొచ్చాకే బెజవాడకు కృష్ణానది, దుర్గ గుడి, భవానీ ద్వీపం వచ్చినట్టు జగన్ మాట్లాడుతున్నారు. తాను లేకపోతే విజయవాడే లేదన్నట్లుగా జగన్ గొప్పలు ఉన్నాయి. టీడీపీ హయాంలోనే మూడు ఫ్లైఓవర్లు వచ్చాయి. రాష్ట్రం మధ్యన ఉన్న అమరావతి రాజధాని ఉంటేనే అందరికీ ఉపయోగం. విశాఖ అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. విశాఖ రైల్వే జోన్ రాకపోయినా జగనులో చలనం లేదు. జగన్ కేంద్రం మెడలు వంచడం కాదు.. మోడీ కాళ్ల మీద పడుతున్నాడు. ఇళ్లల్లో ఆడవాళ్లను అన్యాయంగా లాగుతున్నారు, దూషిస్తున్నారు. మీ ఇళ్లల్లో భార్య, తల్లి, పిల్లల్లేరా..? సంస్కార హీనులుగా మారకండి. ఆడవాళ్లను తిట్టే అన్ని పార్టీ నాయకులకు చెబుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో