TDP : బెజవాడలో మళ్లీ హీటెక్కుతున్న టీడీపీ పాలిటిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెజవాడలో టీడీపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పర్యటన సందర్భంగా కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా దేవినేని ఉమపై కేశినేని నాని సెటైర్లు వేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఎంపీ కేశినేని నాని, జలీల్ ఖాన్ పాల్గొన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి బుద్దా వెంకన్న, నాగుల్ మీరా దూరంగా ఉన్నారు. అయితే.. టీడీపీ ఎంపీ కేశినేని మాట్లాడుతూ.. అందరినీ భాగస్వామ్యం చేసి టీం టీడీపీ పేరుతో కార్యక్రమాలు చేస్తామన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. కమర్షియల్ నేతలను అంగీకరించే ప్రసక్తే లేదని, ఎక్కడో తొడలు కొట్టినంత మాత్రాన నేతలు కాలేరన్నారు. మీడియా నుంచి కాదు.. ప్రజల్లో నుంచే నాయకులు బయటకి వస్తారని, చంద్రబాబు సీఎం కావాలనే సంకల్పంతో కలిసి మెలిసి పని చేయాలన్నారు. నాకు నేనే గొప్ప అని వెళితే ప్రజల్లో పరాభవం తప్పదని, అందరూ ఎవరి స్థాయిలో వారు పని పంచుకుని ముందుకు సాగాలని ఆయన హితవు పలికారు. గతేడాది నుంచి ఇక్కడ ప్రజాస్వామ్యబద్దంగా టీడీపీ పని చేస్తుందని, ఎవరు పదవులు పొందినా ఐక్యంగా నిర్ణయం జరిగిందన్నారు. జగన్ పాలనలో ప్రజలు పాట్లు పడుతున్నారని, యధా రాజా తధా ప్రజ అన్నట్లుగా వైసీపీ నేతలు ఉన్నారన్నారు.
Also Read
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
వారు ఎన్ని మాయలు చేసినా ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జగన్ మాయ మాటలను, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల,మతాలకతీతం. పార్టీ నే కాదు… వ్యక్తిని చూసి ఓటేస్తారు. 2019ఎన్నికల్లో ఎంపిగా నాకు మెజారిటీ ఇచ్చారు.. ఎమ్మెల్యేని ఓడించారు. తానొచ్చాకే బెజవాడకు కృష్ణానది, దుర్గ గుడి, భవానీ ద్వీపం వచ్చినట్టు జగన్ మాట్లాడుతున్నారు. తాను లేకపోతే విజయవాడే లేదన్నట్లుగా జగన్ గొప్పలు ఉన్నాయి. టీడీపీ హయాంలోనే మూడు ఫ్లైఓవర్లు వచ్చాయి. రాష్ట్రం మధ్యన ఉన్న అమరావతి రాజధాని ఉంటేనే అందరికీ ఉపయోగం. విశాఖ అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. విశాఖ రైల్వే జోన్ రాకపోయినా జగనులో చలనం లేదు. జగన్ కేంద్రం మెడలు వంచడం కాదు.. మోడీ కాళ్ల మీద పడుతున్నాడు. ఇళ్లల్లో ఆడవాళ్లను అన్యాయంగా లాగుతున్నారు, దూషిస్తున్నారు. మీ ఇళ్లల్లో భార్య, తల్లి, పిల్లల్లేరా..? సంస్కార హీనులుగా మారకండి. ఆడవాళ్లను తిట్టే అన్ని పార్టీ నాయకులకు చెబుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
-
Triumph Bonneville T120: భారత్లో లాంచ్ అయిన ట్రయంఫ్ బోనేవిల్ T120.. రెట్రో డిజైన్ ధర, ఫీచర్లు ఇవే
-
Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
-
Peddi: భోపాల్లో ‘పెద్ది’ ఆడియో లాంచ్పై భారీ ప్లాన్..ఈవెంట్కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!